యాక్షన్ తో మహేష్ మొదటి అడుగు

Update: 2023-01-17 05:55 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారికాహాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 18 నుంచి ప్రారంభం అవుతుందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. ఇక ఈ షూటింగ్ కి సంబందించిన న్యూ షెడ్యుల్ హైదరాబాద్ లోనే మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యుల్ ని యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్ ని జనవరి 18 నుంచి చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇప్పటికే ప్రత్యేకమైన సెట్స్ కూడా వేసారని బోగట్టా. రెండు వారల పాటు యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగనుంది. వీటి తర్వాత వెంటనే టాకీ పార్ట్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై మాటల మాంత్రికుడు మరింత శ్రద్ధ తీసుకొని తెరకెక్కించే పనిలో ఉన్నారని సమాచారం.

అన్ని భాషల వారికి రీచ్ అయ్యే విధంగా క్యాస్టింగ్ ఎంపిక జరిగిందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇక అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

అలాగే శ్రీమంతుడు సినిమా తర్వాత డిజాస్టర్ అంటూ లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు సరైన కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో దీనిపై కూడా దీనిపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

ఇక త్రివిక్రమ్ కూడా రెగ్యులర్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు పాన్ ఇండియా పీపుల్ కి రీచ్ అయ్యే విధంగా పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కాన్సెప్ట్ తోనే మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ముందుగానే యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News