ట్రాక్ లోకి వ‌చ్చేసిన మెగా మేన‌ల్లుడు

Update: 2022-06-13 06:45 GMT
మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌. అనదైన మార్కు సినిమాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. స్టార్ డ‌మ్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త ఏడాది న‌టించిన చిత్రం 'రిప‌బ్లిక్‌'. దేవా క‌ట్టా డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు సెప్టెంబ‌ర్ లో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. బైక్ పై వెళుతూ గ‌చ్చిబౌలి ప్రాంతంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు.

ఆ షాకులో ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌త్యేక చికిత్స పొందారు. నెల‌రోజుల పాటు హాస్ప‌ట‌ల్ లోనే వున్న ఆయ‌న ఆ త‌రువాత కొన్ని నెల‌ల పాటు విశ్రాంతి తీసుకుంటూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌మాదం నుంచి కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న 15వ చిత్రాన్ని ప్రారంభించేశాడు. కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మిస్తున్నారు.

మిస్టిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. కేవ‌లం 25 రోజుల్లోనే ఈ మూవీ 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోవ‌డం విశేషం.

రెట్టించిన ఉత్సాహంతో వున్న హీరో సాయి తేజ్ వీలైనంత శ‌ర వేగంగా ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇందు కోసం టీమ్ తో క‌లిసి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉందుకు సాగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా సోమ‌వారం చిత్ర బృందం ఆన్ లొకేష‌న్ కు చెందిన ఓ ఫొటోని షేర్ చేసింది.

డార్క్ చీక‌ట్లో వెన్నెల వెలుతురు మ‌ధ్య షూట్ చేస్తున్న దృశ్యాల‌కు సంబంధించిన తాజా పిక్ సినిమా మూడ్ ని తెలియ‌జేస్తోంది. ఈ ఫొటోతో సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్‌. యంగ్ డైరెక్ట‌ర్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ కు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌లేదు. SDT15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ .. సుకుమార్ రైటింగ్స్ పై నిర్మిస్తున్నారు.

షామ్ ద‌త్ సైనుద్దీన్ ఫొటోగ్ర‌ఫ‌ఫీని అందిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌క‌టించిన రోజే విడుద‌ల చేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ అంద‌రిలోనూ అంచ‌నాల్ని పెంచేసింది. అంతే కాకుండా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి  థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీని చేస్తుండ‌టం, సుకుమార్ వంటి ద‌ర్శ‌కుడు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం కూడా ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాల్ని పెంచేస్తోంది. 'భీమ్లానాయ‌క్‌' ఫేమ్ సంయుక్త మీన‌న్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది.
Tags:    

Similar News