హ‌బ్బీని డాట‌ర్ ని మిస్సైన న‌మ్ర‌త‌

Update: 2021-12-29 05:44 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ 28వ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా యూనిట్ దుబాయ్ లో ఉంది. `స‌ర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ ముగించుకుని మ‌హేష్ ఈ కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించారు. అయితే మ‌హేష్ ప్ర‌తిసారీ త‌న‌ సినిమాల‌ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వెకేష‌న్ కోసం కొద్ది రోజుల పాటు ఫ్యామిలీతో విదేశాలకు ట్రిప్ వెళ్తారు.

కొన్ని వారాల పాటు విదేశీ అందాల్ని ఆస్వాధించి ఫ్రెష్ గా కొత్త సినిమా షూట్ లో జాయిన్ అవుతారు. అయితే ఈసారి తొలి షెడ్యూల్ త్రివిక్ర‌మ్ దుబాయ్ లో ప్లాన్ చేయ‌డంతో ప‌నిలో ప‌నిగా మ‌హేష్ ఫ్యామిలీ స‌మ‌యాన్ని దుబాయ్ లో కేటాయించాల‌ని ప్ర‌ణాళిక‌ను రూపొందించారు.

షూటింగ్ ఇంకా ప్రారంభం కాక‌పోవ‌డంతో క్వాలిటీ స‌మ‌యాన్ని ఫ్యామిలీతోనే గ‌డుపుతున్నారు. తాజాగా మ‌హేష్‌-కుమార్తె సితారతో క‌లిసి న‌డుచుకుంటూ వ‌స్తోన్న ఓ ఫోటోని న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ``వీరిద్ద‌రు ఇలా ఎక్క‌డికి న‌డుచుకుంటూ వెళ్తున్నారంటే? ఉద‌యాన్నే ఫ్రెష్ అయి మంచి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా క‌లిసి వెళ్తున్నారు.

ఈ ఫోటోని ఉద్ధేశించి న‌మ్ర‌త ఓ క‌థ‌ని చెప్పుకొచ్చారు. ``అసంఖ్యాక‌మైన ప‌క్షులు.. తేనెటీగ‌లు వంటి అంద‌మైన జీవుల మ‌ధ్య ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో రుచిక‌ర‌మైన అల్పాహారం తిన‌డానికి సిద్ధంగా ఉన్న‌ ఈ ఇద్ద‌రికి తెల్లవారుఝామున ఎప్పుడూ పని ఉండదు. రోజుకు సంబంధించిన ప్లాన్ ప్ర‌తీ రోజు ఇక్క‌డే tjis టన్నెల్‌లో రూపొందుతుంది.

ప్ర‌తీ ఉద‌యం ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. ఈ విజువ‌ల్ క్యాప్చ‌ర్ చేయ‌డం కోసం ముందుకు న‌డిచాను. కాబ‌ట్టి నేను కార్డులోని మెనుని కోల్పోయాను. కానీ తీపి జ్ఞాప‌కం వాళ్ల‌కి అప్ప‌గించాలి. మంచి అల్పాహారం తీసుకున్నారు. నేను కూడా వీళ్లిద్ద‌రు నుంచి నేర్చుకోవ‌డం ప్రారంభించే సమ‌యం అస‌న్న‌మైంద‌ని భావిస్తున్నాన‌ని`` భ‌ర్త‌-కుమార్తెల‌ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ అరుదైన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


Tags:    

Similar News