అల్లువారి ఈవెంట్ కు న్యాచురల్ టచ్

Update: 2019-05-11 17:23 GMT
మెగా ఫ్యామిలీలో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో అల్లు శిరీష్ ఒకరు.  'శ్రీరస్తు శుభమస్తు' తో సక్సెస్ సాధించినా.. మెగా ఫ్యామిలీ హీరోల రేంజ్ హిట్ అయితే కాదు.  దీంతో శిరీష్ తన హోప్స్ అన్ని కొత్త సినిమా 'ఎబీసిడీ'(అమెరికా బోర్న్ కన్ ఫ్యూజ్ద్ దేశి) పై పెట్టుకున్నాడు.  రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా కు ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి.

తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు.  మే 13 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫిలిం నగర్ లోని జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం ప్లాన్ చేశారు.  అల్లు శిరీష్ సినిమా అనగానే చీఫ్ గెస్ట్ గా మనం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఎక్స్ పెక్ట్ చేస్తాం.  అయితే 'ఎబీసిడీ'  మేకర్స్ కు అది రొటీన్ గా అనిపించిందేమో కానీ శిరీష్ అన్నయ్యను కాకుండా న్యాచురల్ స్టార్ నానిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.  అల్లు ఫ్యామిలీతో నానికి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ విషయాన్ని 'ఏబీసిడీ' మేకర్స్ అధికారికంగా కన్ఫామ్ చేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

మలయాళం సినిమా 'ఎబీసిడీ' కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిరీష్ సరసన రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది.  కోట శ్రీనివాస రావు.. భరత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.  సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాని మథుర శ్రీధర్ నిర్మిస్తున్నారు.  మే 17 న 'ఎబీసిడీ' రిలీజ్ కానుంది.



Tags:    

Similar News