పుత్రోత్సాహంలో పూరి

Update: 2015-06-09 06:00 GMT
దర్శకుడు పూరి జగన్నాథ్‌ పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. తన కొడుకు ఆకాష్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ మరో మూడేళ్ల తర్వాత  సినిమా తీయాలనుకొన్నాననీ... కానీ 'ఆంధ్రాపోరి' చూశాక వెంటనే సినిమా తీయాలనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఆకాష్‌ నటన గురించి కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడు పూరి. చిన్నప్పట్నుంచి సినిమాల్లో పెరిగిన ప్రభావమేమో కానీ... ఆకాష్‌ చాలా ఈజీగా నటించేశాడని పూరి తన కొడుకుకి కితాబునిచ్చేశాడు.  

    ఆకాష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఆంధ్రాపోరి' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మరాఠీ చిత్రం 'టైమ్‌పాస్‌' ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సినిమా విడుదలైన మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి పూరి జగన్నాథ్‌ సినిమాని ప్రత్యేకంగా వీక్షించాడు. అందులో కథానాయకుడు రవితేజ కూడా ఉన్నారు. సినిమా చూశాక పూరి విలేకరులతో సమావేశమయ్యారు. ''ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లాంటి ఓ పెద్ద సంస్థ నుంచి నా కొడుకు కథానాయకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. వాడి నటన చాలా బాగా నచ్చింది'' అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తనతో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News