కీలక ఆస్తులను భార్యపేరిట మార్చిన రాజ్ కుంద్రా.. కారణమేంటి?

Update: 2022-02-04 04:41 GMT
గతేడాది అశ్లీలత కేసులో అరెస్టయి బెయిల్‌ పొందిన వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా తన భార్య అయిన నటి శిల్పాశెట్టికి రూ.38.5 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ఫ్లాట్లను బదిలీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

కినారాలో ఉన్న ఐదు ఫ్లాట్‌లతో కూడిన మొదటి అంతస్తును, రాజ్ కుంద్రా దంపతులు నివసించే బంగ్లాను శిల్ప పేరున బదిలీ చేశాడు. జనవరి 21, 2022న నమోదైన ట్రాన్స్‌ఫర్ డీడ్‌పై నటి రూ.1.9 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించింది.

స్థానిక బ్రోకర్లు మాట్లాడుతూ.. ఈ బదిలీ మార్కెట్ విలువ ప్రకారం చదరపు అడుగుకు రూ. 65,000గా ఉంది.  ఈ బంగ్లా బీచ్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉంది. చాలా విలాసవంతమైన ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.38.5 కోట్లుగా ఉంది.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులకు భారీగా ఆస్తులున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అంటున్నారు. ముంబైలోని జుహూ ఏరియాలో రాజ్ కుంద్రా-శిల్పాలకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. ఇక్కడే వీరు జీవిస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

ఇక ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో కూడా వీరికి ఓ ఫ్లాట్ ఉండేదని.. అది సరిపోకపోవడంతో అమ్మేసినట్టు తెలిసింది. ఇక ఇంగ్లండ్ దేశంలోని సర్రేలో ఈ జంటకు అందమైన మాన్షన్ ఉందట.. వీరు హాలీడేస్ కోసం యూరప్ వెళ్లినప్పుడు ఇక్కడే స్టే చేసి మొత్తం అన్నీ చుట్టి వస్తారట..

ఇక వీరికి సొంతంగా ప్రైవేటు జెట్ ఉందని చెబుతున్నారు. ఎక్కడికెళ్లినా సొంత విమానంలో ప్రయాణం చేస్తారని సమాచారం. ఇక ఖరీదైన లాంబోర్గిని కార్లు, బీఎండబ్ల్యూ , సహా లగ్జరీ కార్లు వీరు కొని గ్యారేజ్ లో పెట్టుకుంటారట.. ఇక రాజ్ కుంద్రా గతంలో శిల్పా కు ఏకంగా 3 కోట్ల ఉంగరం కొనిచ్చాడట.. ఇలా లగ్జరీ లైఫ్ లో కావలసినంతగా వీరి సంపాదన ఉందంటే కోట్లు సంపాదిస్తున్నట్టే లెక్క. అదంతా ఎక్కడిదన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.


Tags:    

Similar News