రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు దాదాపు మూడున్నరేళ్లుగా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లో వీక్షించాలా అని ఎదురుచూశారు. మొత్తానికి వారి కల ఫలించింది.
ఎట్టకేలకు మార్చి 25న అనేక అవాంతరాల అనంతరం భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ సరికొత్త చరిత్రని లిఖిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని తిరగరాయబోతోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ లో నటించిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పాత్రలపై నెట్టింట ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా పెద్ద డిమేటే నడుస్తోంది. ఓ హీరో ఫ్యాన్స్ మరో హీరో అభిమానుల్ని దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు.
వీరి మధ్యలో ఎవరు ఎంటరైనా వారిని కూడా చెడుగుడు ఆడేస్తున్నారు. ఇదిలా వుంటే ఎన్టీఆర్ పై తాజాగా దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్న వ్యాఖ్యలు ఇప్పడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ నటన గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఫెంటాస్టింక్ యాక్టర్. ఆ విషయంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ ని వంక పెట్టే వారే లేరు. ఇదే విషయాన్ని తాజాగా రాజమౌళి స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలని సమానంగా జక్కన్న బ్యాలెన్స్ చేస్తూ చూపించాడు.
రామ్ చరణ్ ని అల్లూరిగా ఢిల్లీ ఔట్ స్కర్ట్స్ లో చూపించే జైల్ సీన్ లో టెర్రిఫిక్ ఎంట్రీని ప్లాన్ చేస్తే .. అడవుల్లో తోడేలు, పులి తో చేసే ఫైట్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ చేసే వీరోచిత ఫైట్ ని పవర్ ఫుల్ ఎంట్రీకి వాడుకున్న తీరు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అబ్బురపరిచింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్.. ఎన్టీఆర్ పై చిత్రీకరించిన `కొమురం భీముడో...` సాంగ్ .. క్లైమాక్స్ లో చరణ్ ని ఫుల్ లెంగ్త్ లో అల్లూరి సీతారామరాజుగా ప్రజెంట్ చేసిన తీరు అభిమానుల్ని రోమాంచితుల్ని చేసింది.
అయితే ఇద్దరు హీరోలకు సినిమాలో జక్కన్న ఇచ్చిన ప్రియారిటీపై చర్చ జరుగుతుంటే తాజాగా ఎన్టీఆర్ పాత్రపై రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పడు వైరల్ గా మారాయి. `కొమురం భీముడో సాంగ్ ట్రిపుల్ ఆర్ లో వున్న ప్రధాన ఘట్టాల్లో కీలకమైనది. ఈ పాటలో ఎన్టీఆర్ పలికించిన హవభావాలు ఇండియా వైడ్ గా వున్న ఏ స్టార్ నటుడు పలికించలేడు. ఎమోషన్ని, పెయిన్ ని, అన్నింటినీ ఒకే షాట్ లో ప్రదర్శించి నటుడిగా తానేంటో మరో సారి నిరూపించాడు. ఇది అతని నటనకు ప్రతి రూపం` అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి. ఆయన తాజా వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తుండటం విశేషం.
ఎట్టకేలకు మార్చి 25న అనేక అవాంతరాల అనంతరం భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ సరికొత్త చరిత్రని లిఖిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని తిరగరాయబోతోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ లో నటించిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పాత్రలపై నెట్టింట ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా పెద్ద డిమేటే నడుస్తోంది. ఓ హీరో ఫ్యాన్స్ మరో హీరో అభిమానుల్ని దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు.
వీరి మధ్యలో ఎవరు ఎంటరైనా వారిని కూడా చెడుగుడు ఆడేస్తున్నారు. ఇదిలా వుంటే ఎన్టీఆర్ పై తాజాగా దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్న వ్యాఖ్యలు ఇప్పడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ నటన గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఫెంటాస్టింక్ యాక్టర్. ఆ విషయంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ ని వంక పెట్టే వారే లేరు. ఇదే విషయాన్ని తాజాగా రాజమౌళి స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలని సమానంగా జక్కన్న బ్యాలెన్స్ చేస్తూ చూపించాడు.
రామ్ చరణ్ ని అల్లూరిగా ఢిల్లీ ఔట్ స్కర్ట్స్ లో చూపించే జైల్ సీన్ లో టెర్రిఫిక్ ఎంట్రీని ప్లాన్ చేస్తే .. అడవుల్లో తోడేలు, పులి తో చేసే ఫైట్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ చేసే వీరోచిత ఫైట్ ని పవర్ ఫుల్ ఎంట్రీకి వాడుకున్న తీరు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అబ్బురపరిచింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్.. ఎన్టీఆర్ పై చిత్రీకరించిన `కొమురం భీముడో...` సాంగ్ .. క్లైమాక్స్ లో చరణ్ ని ఫుల్ లెంగ్త్ లో అల్లూరి సీతారామరాజుగా ప్రజెంట్ చేసిన తీరు అభిమానుల్ని రోమాంచితుల్ని చేసింది.
అయితే ఇద్దరు హీరోలకు సినిమాలో జక్కన్న ఇచ్చిన ప్రియారిటీపై చర్చ జరుగుతుంటే తాజాగా ఎన్టీఆర్ పాత్రపై రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పడు వైరల్ గా మారాయి. `కొమురం భీముడో సాంగ్ ట్రిపుల్ ఆర్ లో వున్న ప్రధాన ఘట్టాల్లో కీలకమైనది. ఈ పాటలో ఎన్టీఆర్ పలికించిన హవభావాలు ఇండియా వైడ్ గా వున్న ఏ స్టార్ నటుడు పలికించలేడు. ఎమోషన్ని, పెయిన్ ని, అన్నింటినీ ఒకే షాట్ లో ప్రదర్శించి నటుడిగా తానేంటో మరో సారి నిరూపించాడు. ఇది అతని నటనకు ప్రతి రూపం` అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి. ఆయన తాజా వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తుండటం విశేషం.