మళ్ళీ 30 ఏళ్ళ తరువాత ఆ దర్శకుడితో తలైవా

Update: 2022-10-13 08:34 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు ఎంత పెరుగుతున్న కూడా ఇంకా యువ హీరోల తరహాలోనే వేగంగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ తన తదుపరి సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. జైలర్ అనే ఆ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ సినిమా ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే రజనీకాంత్ త్వరలోనే మరో రెండు సినిమాలను కూడా మొదలుపెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఇక ఆ రెండు సినిమాలు కూడా లేక ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. రీసెంట్ గా రజనీకాంత్ ఆ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఇదివరకే లైకా ప్రొడక్షన్లో రజనీకాంత్ 2.0, దర్బార్ అనే రెండు సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అయితే కాలేదు.

కానీ రజినీకాంత్ తోనే మరో రెండు సినిమాలు చేసినందుకు ఆ సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇక రజనీకాంత్ కోసం దర్శకులను వెతుకుతున్న లైకా ప్రొడక్షన్స్ ముందుగా మణిరత్నం కాంబినేషన్లో ఒక సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు. రజనీకాంత్ మణిరత్నం గత 30 ఏళ్ల క్రితం దళపతి అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు వీరి కలయికలో మరో సినిమా రాబోతోంది. ఇటీవల మనిరత్నం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ముందుగానే రజినీకాంత్ తో కూడా ఒక సినిమా ఫిక్స్ చేసుకునేందుకు మణిరత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

లేక ప్రొడక్షన్లో మరో సినిమా చేసిన తర్వాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. మరి ఈ సినిమాలతో సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను నమోదు చేస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News