అలా రకుల్ కు కలిసొచ్చింది

Update: 2017-08-03 05:10 GMT
తెలుగులో వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెల్లుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు ఇక్కడ స్టార్అయ్యాక అటు బాలీవుడ్ వైపు చూపులుచూస్తోంది అనుకున్నాం. కాని రకుల్ సినిమాలలో నటించాలి అనుకున్నప్పుడు ముందుగా హిందీలోనే ప్రయత్నం చేసింది. కొన్ని అనుకోని పరిణామాలు వలన అది కుదరక ఇలా తెలుగులోకి హీరోయిన్ గా వచ్చి కొంచెం  అనుభవం తెచ్చుకొని.. తిరిగి హిందీవైపు అడుగులు వేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి సినిమా ఆడిషన్ హిందీ ఫిల్మ్ డైరెక్టర్ నీరజ్ పాండే సినిమా కోసం 2011లో ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు చాల చిన్నది అవ్వడం చేత ఆ ఛాన్స్ మిస్ అయ్యింది అని చెబుతుంది. ఆ తరువాత తెలుగులో బిజీ అయ్యింది. మళ్ళీ ఒకసారి నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఎమ్ యెస్ ధోని సినిమాలో ఒక పాత్ర కోసం అవకాశం వచ్చింది అంటా. కానీ అప్పుడు సరైనోడు సినిమా షూటింగులో ఉండటం వలన కుదర్లేదట. అలా అవకాశం తప్పినందుకు రకుల్ భాదపడటం లేదట. ఎందుకంటే అలా మిస్ అయినా తెలుగులో మంచి గుర్తింపు అభిమానం దొరికింది కదా అని అంటుంది. నాకు నా పై నమ్మకం వచ్చేలా చేసింది తెలుగు సినిమానే అని కూడా చెబుతుంది. అయన మరేమీ పర్వాలేదు లెండి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది అదే నీరజ్ పాండే సినిమాలో అని చాలా ఉత్సాహంగా చెప్పింది.

అయారీ అనే చిత్రంతో రకుల్ ఇప్పుడు బాలీవుడ్ లోకి మరోసారి ఎంట్రీ కాబోతుంది. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రాతో జతకట్టింది. నీరజ్ పాండే సినిమాలు అంటే హై పిచ్ ఎమోషన్ ఉంటుంది అలాంటి పాత్రలలో నటించాలి అంటే కచ్చితంగా నటనలో అనుభవం ఉంది తీరాలి. మరి ఇప్పుడు రకుల్ కు అనుభవం ఉన్నట్లే కదా. అలా అదృష్టం కొద్ది ఛాన్స్ తప్పి మంచి అవకాశం కొట్టేసింది అనమాట.
Tags:    

Similar News