సైలెంట్‌గా కానిచేస్తున్న చరణ్‌

Update: 2018-08-30 10:13 GMT
రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. సుకుమార్‌ దర్శకత్వం లో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఏకంగా 125 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతటి భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమా అవ్వడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం చరణ్‌తో ఒక హై ఎనర్జిటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ‘జయ జానకి నాయక’ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇదే.

చరణ్‌ - బోయపాటిల కాంబో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా గురించి అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కాని చిత్రానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా దర్శకుడు బోయపాటి శ్రీను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటి వరకు చరణ్‌ కు సంబంధించిన లుక్‌ కాని, సినిమాకు సంబంధించిన విషయం కాని లీక్‌ కాలేదు. టైటిల్‌ విషయంలో మొదట పలు పుకార్లు షికార్లు చేశాయి, కాని ఇప్పుడు టైటిల్‌ విషయంలో కూడా ఎలాంటి లీక్‌ ఇవ్వడం లేదు. సినిమాను చాలా సైలెంట్‌ గా పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నాడు.

సినిమాకు హైప్‌ తీసుకు రావడం సులభమే, కాని ఆ హైప్‌ను చేరుకోవడం కష్టం. అందుకే ఇప్పటికే హైప్‌ భారీగా ఉన్న ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు చెప్పి ఆ హైప్‌ను మరింతగా పెంచడం మంచిది కాదని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసి విడుదల ముందు హడావుడి చేయాలనేది బోయపాటి ప్లాన్‌గా సమాచారం అందుతుంది. సెప్టెంబర్‌ 2న పవన్‌ పుట్టిన రోజు సందర్బంగా చరణ్‌ మూవీ లుక్‌ను సింపుల్‌గా విడుదల చేయాలని బోయపాటి నిర్ణయించుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా రంగస్థలం స్థాయి విజయాన్ని దక్కించుకుంటుందా అంటూ మెగా ఫ్యాన్స్‌ లో చర్చ జరుగుతుంది.
Tags:    

Similar News