బిగ్‌ బాస్ టాస్క్: మొగుడు-పెళ్ళాలుగా జీవించేశారుగా..

Update: 2019-09-26 04:59 GMT
అవకాశం వస్తే చాలు...బిగ్ బాస్ ఇంటి సభ్యులు అల్లుకుపోతున్నారు. బిగ్‌ బాస్ హౌస్ లో ఉండటం కోసం ఎంతవరకైనా వెళ్ళిపోతున్నారు. మొన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు’ టాస్క్ బుధవారం ఎపిసోడ్‌ లో కూడా కొనసాగింది. అత్తగా శివజ్యోతి అదరగొడుతుంటే... నిజంగా మొగుడు పెళ్లాలైన వరుణ్-వితికాలు కూడా ఆ రేంజ్ లో ప్రదర్శన చేయడం లేదు కానీ.... రవి-శ్రీముఖి - రాహుల్-పునర్నవి జంటలు మాత్రం జీవించేస్తున్నాయి.

ముఖ్యంగా రాహుల్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా పునర్నవిని పెళ్ళామా..పెళ్ళామా అంటూ రెచ్చిపోతున్నాడు. ఇక నేనేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా పున్నూ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసేసింది. ‘ఆయన గారూ.. మీకు ఏం కావాలో చెప్పండి.. డిన్నరా? టీనా? ఏం పెట్టను.. పెట్టనా? ఆయనగారూ.. నా చేతితో పెడతా.. నా బుజ్జి బుజ్జి చిన్న చిన్న చేతులతో పెడతా ఆయనగారూ. మీ నవ్వు గురించే కదా.. నేను పెళ్లి చేసుకున్నది’ అంటూ రాహుల్‌ మీద ప్రేమ కురిపించింది. అలాగే శ్రీముఖి-రవి జోడీ కూడా ఆకట్టుకుంది. శ్రీముఖి అయితే అత్త శివజ్యోతిని ఇంప్రెస్ చేసేందుకు తెగ పనులు చేసేసి...ఆమెకు కావాల్సినవి వండి పెట్టేసింది.

ఇక రాత్రి సమయంలో టాస్క్ ఆపేశాక బాబా భాస్కర్ - రవి - శివజ్యోతి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. ప్రస్తుతం నామినేషన్‌ లో ఉన్న రవిక్రిష్ణ.. తాను వెళ్తే కింగ్‌ లా బయటకు వెళ్తా అని అన్నాడు. దీంతో నీ గురించి తెలిసి కూడా నామినేషన్ లో ఓటు వేయలేకపోయానురా అంటూ బాబా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు ఏడ్వడం ఏంటి మాస్టార్ అంటూ శివజ్యోతి కంట్రోల్ చేయగా.... పప్పా.. ఏడవద్దు అంటూ కన్నీళ్లు తుడిచాడు రవి. అయితే నామినేషన్ అప్పుడూ గ్రూప్‌ లు కట్టి - తరవాత కూడా గ్రూప్‌ లు కట్టి టార్గెట్ చేయడంతో మనం మాట్లాడటానికి కూడా లేకుండా పోతుందని - అందుకే ఇక్కడ తనకు ఉండాలని అనిపించడం లేదంటూ భాస్కర్ బోరున ఏడ్చారు.



Tags:    

Similar News