బాలయ్య మూవీ.. సిల్లీ పుకారు

Update: 2019-02-03 13:15 GMT
నందమూరి బాలకృష్ణ తాజాగా 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా నెగటివ్‌ కలెక్షన్స్‌ దక్కాయి. త్వరలోనే 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమయంలోనే బాలయ్య తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో అంటూ ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ చరణ్‌ తో 'వినయ విధేయ రామ' చిత్రంను తెరకెక్కించి తీవ్రంగా నిరాశ పర్చిన బోయపాటి తదుపరి చిత్రంను బాలయ్యతో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు వీరిద్దరి కాంబో మూవీ గురించి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కాని సినీ వర్గాల్లో మాత్రం రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఈ హ్యాట్రిక్‌ మూవీలో కూడా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని, అందులో ఒక పాత్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటాయని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం గురించి మరో పుకారు సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది.

ఇప్పటికే ఉన్న పుకార్లపై క్లారిటీ రాలేదు.. తాజాగా ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌ గా శ్రద్దా శ్రీనాథ్‌ ను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. కన్నడ బ్యూటీ అయిన శ్రద్ద తెలుగు ప్రేక్షకుల ముందుకు నానితో కలిసి 'జెర్సీ' చిత్రంతో రాబోతుంది. ప్రస్తుతం బాలయ్య తదుపరి చిత్రం గురించి ఆలోచించేంత ఖాళీ అయితే లేడు. ఇదే సమయంలో ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ కాకుండానే హీరోయిన్స్‌ ను ఎంపిక చేయడం కూడా సాధ్యం కాదు. బోయపాటి అప్పుడే హీరోయిన్స్‌ విషయం వద్దకు వెళ్లి ఉండడు. అందుకే ఈ వార్త నిజం అయ్యి ఉండదు.
Tags:    

Similar News