ఈగ ప్రొడ్యూసర్ మళ్లీ హ్యాండ్ వేశాడు

Update: 2015-11-22 15:30 GMT
డిస్ట్రిబ్యూషన్ లోంచి నిర్మాణంలోకి వచ్చిన వాళ్లలో సాయి కొర్రపాటి ఒకడు. ఐతే మొదట్నుంచి చాలా భిన్నమైన సినిమాలే తీస్తూ నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి. ఈగ దగ్గర్నుంచి తుంగభద్ర వరకు ఆయన తీసినవన్నీ డిఫరెంట్ మూవీసే. ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి - అవసరాల శ్రీనివాస్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు సాయి. మరోవైపు అప్పుడప్పుడూ డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇందులో పెద్ద చిన్న రెండు రకాల సినిమాలూ ఉంటున్నాయి.

ఈ మధ్యే ‘రాజు గారి గది’ లాంటి పెద్దగా పేరు లేని సినిమాను హోల్ సేల్ గా కొనేసి డిస్ట్రిబ్యూట్ చేశాడు సాయి. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. తాజాగా సాయి కళ్లు ఇంకో చిన్న సినిమా మీద పడ్డాయి. అదే.. జత కలిసే. ‘ఐస్ క్రీమ్’ ఫేమ్ తేజస్వి మదివాడ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ‘రాజు గారి గది’ హీరో అశ్విన్ ఆమెకు జోడీగా నటించాడు. రాఘవేంద్రరావు నిర్వహించిన టీవీ షో ‘రేపటి దర్శకులు’తో పేరు తెచ్చుకున్న రాకేశ్ శశి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమాకు స్టార్ అట్రాక్షన్ ఏమీ లేకున్నా.. కంటెంట్ మీద నమ్మకంతో హోల్ సేల్ గా కొనేశాడు సాయి. ఆయన హ్యాండ్ పడిందంటే.. సినిమాలో విషయం ఉండే ఉంటుందన్న నమ్మకంతో బయ్యర్లు కూడా బాగానే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News