రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో స‌మంత దీపావ‌ళి వేడుక‌

Update: 2021-11-06 05:30 GMT
ఈ ఏడాది దీపావ‌ళి పండ‌గ‌ను టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. క‌రోనా కార‌ణంగా ఏదిన్న‌ర‌గా అన్ని ర‌కాల పండుగ‌ల‌కు దూర‌మైన సెల‌బ్రిటీలు క‌రోనా తగ్గ‌డంతో సెల‌బ్రిటీలు వేడుక‌ల‌కు ఎంత మాత్రం వెనుక‌డ‌గు వేయ‌లేదు. టాలీవుడ్ టాప్ హీరోలంతా త‌మ కుటుంబాల‌తో వేడుక‌ని వైభ‌వంగా జ‌రుపుకున్నారు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న దంప‌తులు గ్రాండ్ దీవాళీ ఈవెంట్ ని నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో కుటుంబ స‌భ్యులంతా పాల్గొన్నారు. కొణిదెల‌-కామినేని కుటుంబాలు ఒకేచోట హాజ‌రై వేడుక‌లు జ‌రుపుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉపాస‌న త‌ల్లి శోభ‌నా కామినేని..చెల్లి అనుష్పాల‌..అలాగే చ‌ర‌ణ్ త‌ల్లి సురేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అలాగే ఈ వెడుకల్లో మెగా ఫ్యామిలీ ఇంట ఇద్ద‌రు ప్ర‌త్యేక గెస్ట్ లు ఉన్నారు. వాళ్లే స‌మంత‌... ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి. వీళ్లిద్ద‌రు కూడా ఈ దివాళీని ఈ రెండు కుటుంబాల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. చ‌ర‌ణ్‌-ఉపాస‌న ఆహ్వానం మేర‌కు స‌మంత స్నేహితురాలితో క‌లిసి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అక్కినేని ఇంట కోడలైన త‌ర్వాత స‌మంత ఆ కుటుంబంతో క‌లిసి పండుగ‌ల్ని జ‌రుపుకునేది. కానీ ఇటీవ‌లే మ‌న‌స్ప‌ర్థ‌లు కార‌ణంగా చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని కుటుంబంతో ఆమెకున్న బంధం వీగిన సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ ఇంట‌ వేడుక‌కు సంబంధించిన ఫోటోల్ని ఉపాస‌న ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేసారు. నా జీవితాన్ని ప్ర‌త్యేకంగా మార్చినంద‌కు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. చ‌ర‌ణ్ మెరూన్ చార‌ల కుర్తా ధ‌రించి.. చేతిలో పెంపుడు కుక్క‌పిల్ల‌తో క‌లిసి ఫోజులిచ్చారు. ఉపాస‌న రెడ్ ఎంబ్రాయిడ‌రీ గౌనులో మెరిసారు. కుటుంబ స‌భ్యులు..స‌మంత‌..శిల్పారెడ్డి అంద‌రితో క‌లిసి చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు కెమెరాకి ఫోజులిచ్చారు.




Tags:    

Similar News