ఔను.. ఆ సినిమా చేస్తున్నా-శర్వానంద్

Update: 2017-01-13 16:19 GMT
రన్ రాజా రన్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. ఎక్స్‌ప్రెస్ రాజా.. ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టేసి ఊపుమీదున్నాడు శర్వానంద్. మరోవైపు దర్శకుడు దేవా కట్టా చూస్తే... ఆటోనగర్ సూర్య, డైనమైట్ లాంటి డిజాస్టర్లు తీసి రేసులో బాగా వెనుకబడిపోయి ఉన్నాడు. ఇలాంటి టైంలో శర్వా.. దేవా కట్టా సినిమా చేయబోతున్నాడంటూ వార్తలొచ్చాయి కొన్ని రోజుల కిందట. దీని గురించి అఫీషియల్ న్యూస్ ఏమీ రాకపోవడం.. శర్వా, దేవా కూడా స్పందించకపోవడంతో ఇది జస్ట్ రూమరేమో అనుకున్నారంతా. ఐతే దేవాతో తాను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అని కన్ఫమ్ చేశాడు శర్వా.

‘‘‘ప్రస్థానం’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. నాకు అలాంటి సినిమాను అందించిన దేవాతో మళ్లీ పని చేయబోతున్నా. నా నుంచి ప్రేక్షకులు ‘ప్రస్థానం’ లాంటి వైవిధ్యమైన సినిమాను కోరుకుంటున్నారు. నన్ను కలిసినపుడు చాలామంది అలాంటి సినిమా కోసం అడిగారు. దర్శకుడు దేవా కట్టా కూడా అలాంటి కథనే రెడీ చేస్తున్నాడు. ఇది ప్రస్థానం తరహాలోనే ఉంటుంది కానీ.. దానికి సీక్వెల్ కాదు. ఇది మరో కొత్త కోణంలో ఉంటుంది’’ అని శర్వా చెప్పాడు. ఇక తన లేటెస్ట్ మూవీ ‘శతమానం భవతి’ గురించి చెబుతూ.. ‘‘ఇది ఎవరో చేయాల్సిన సినిమా. నాకొచ్చింది. సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి ఇది మంచి కథ అని.. నేను చేస్తే బాగుంటుందని చెప్పాడు. అంతగా ఆసక్తి లేకుండానే కథ విన్నాను. చేశాను. ఇంత మంచి సినిమాలో చేయడం నా అదృష్టం. నా జీవితాంతం ఈ చిత్రాన్ని గుర్తుపెట్టుకుంటా’’ అని శర్వా చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News