దిల్ రాజు తమిళ యాసను ట్రోల్ చేసిన SKN

Update: 2023-01-21 04:13 GMT
ఈ మధ్యకాలంలో ఎవరు కాస్తా ఫన్నీగా ఏం చేసిన సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీలు ఈ ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాని ఒక్కోసారి ఇవి శృతి మించినపుడు ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ట్రోల్స్ అనేవి సోషల్ మీడియాలో చూసే వారికి కాస్తా వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.

ఈ కారణంగానే ట్రోలింగ్ మీమ్స్ ని ఇప్పుడు అందరూ ఆశ్వాదిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే వారసుడు మూవీ రిలీజ్ సందర్భంగా తమిళంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. అయితే అతనికి తమిళ్ బాష అంతగా రాకపోవడంతో పేపర్ మీద కొన్ని పాయింట్స్ రాసుకొని వాటిని స్టేజ్ మీద మాట్లాడారు. అయితే ఫైనల్ గా కామెడీ ఇరిక్కు, ఫైట్స్ ఇరిక్కు, స్టొరీ ఇరిక్కు, విజయ్ మేనరిజమ్ ఇరిక్కు అంటూ తమిళంలో స్పీచ్ ఇచ్చారు.

అయితే దిల్ రాజు తమిళ్ స్పీచ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్ ట్రోల్స్ వచ్చాయి. అతని దిల్ రాజు, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు మిక్స్ చేసిన మాట్లాడిన విధానం అందరికి కూడా ఫన్ క్రియేట్ చేసింది. తాజాగా రైటర్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ లాస్ట్ లో దిల్ రాజు తరహాలోనే కొన్ని రాసుకోచ్చాను అంటూ మొబైల్ తీసి. ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు, ఫైట్స్ ఇరిక్కు, స్టొరీ ఇరిక్కు అంటూ మాట్లాడారు.

దిల్ రాజుని ఇమిటేట్ చేస్తూ నిర్మాత శ్రీనివాస్ కుమార్ స్పీచ్ ట్రోల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు హాట్ టాపిక్ అయ్యింది. కేవలం ఫన్ కోసమే అతను స్టేజ్ మీద దిల్ రాజుని ఇమిటేట్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. మరి ఎస్కేఎన్ చేసిన ఈ ఇమిటేషన్ టాలీవుడ్ ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News