ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్ షో

Update: 2017-09-20 06:33 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న "స్పైడర్" సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో కూడా విడుదల అవుతుండడంతో అక్కడి ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వారితో పాటు మలయాళం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. సౌత్ సినీ ప్రేక్షకులందరు "స్పైడర్" రిలీజ్ డేట్ 27కోసమే ఎదురు చూస్తున్నారు.

అయితే మహేష్ అందరికంటే ముందు ఈ సినిమాను కొందరికి చూపెట్టబోతున్నాడట. ఆ చూసే వారు ఎవరో కాదు మహేష్ కుటుంబ సభ్యులే. రీసెంట్ గా అన్ని పనులను పూర్తి చేసుకొని ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. స్పైడర్ కి U/A సర్టిఫికెట్ వచ్చింది. రెండుగంటల 25 నిమిషాల ఈ సినిమాను మొదట మహేష్ చిత్ర యూనిట్ తో కలిసి ఘట్టమనేని కుటుంబ సభ్యులకు స్పెషల్ షో వేయించనున్నాడని తెలుస్తోంది.

ఈ శని - ఆదివారాల్లో ఈ షో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మహేష్ తన ప్రతి సినిమాను కుటుంబ సబ్యులకు చుపించడం అలవాటే అయితే ఈ సారి కాస్త ఎక్కువ మందిని ఆహ్వానించి స్పెషల్ షో వేయనున్నాడట. మహెహ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహించారు. 
Tags:    

Similar News