ఇక నుండి సుకుమార్‌ పేరు మాత్రమే..!

Update: 2023-01-03 02:30 GMT
ట్యాలెంటెడ్‌ డైరెక్టర్ సుకుమార్‌ తన మాస్టర్ స్క్రీన్‌ ప్లేతో పుష్ప ను పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ చేసిన విషయం తెల్సిందే. ఏమాత్రం ప్రచారం లేకుండా ఉత్తర భారతంలో పుష్ప సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది అంటే ఆ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 పనిలో బిజీగా ఉన్నాడు.

గత ఏడాది కాలంగా పుష్ప 2 యొక్క పనిలోనే సుకుమార్‌ ఉన్నాడు. అందుకే ఆయన ఇతర సినిమాల విషయంలో శ్రద్ద చూపడం లేదు. ఇంతకు ముందు సుకుమార్‌ పలు చిన్న సినిమాలకు రచన మరియు స్క్రీన్‌ ప్లే సహకారం అందించి ఆ సినిమాల యొక్క సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మాత్రం పూర్తిగా పుష్ప 2 పైనే సుకుమార్‌ శ్రద్ద పెట్టాడు.

ఇటీవల విడుదల అయిన 18 పేజెస్ సినిమా కు సుకుమార్‌ రచన సహకారం అందించాడు. అలాగే సినిమా యొక్క నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. కానీ పుష్ప 2 పనులతో బిజీగా ఉండటం వల్ల 18 పేజెస్ సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సుకుమార్‌ పాల్గొనలేదు.

సుకుమార్ ఇక నుండి ఇతర దర్శకుల సినిమాల్లో వేలు పెట్టేది లేదని నిర్ణయించుకున్నాడట.. ఇతర దర్శకుల సినిమాలకు కథను స్క్రీన్‌ ప్లేను అందించాలని భావించడం లేదని సన్నిహితుల వద్ద అన్నాడట. సుకుమార్‌ ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా యొక్క నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

ఆ సినిమా కు సుకుమార్‌ నుండి ఎలాంటి రచన సహకారం అందడం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా విడుదల సమయంలో సుకుమార్‌ యొక్క ప్రజెన్స్ ఉండదని.. కేవలం ఆయన పేరుతోనే సినిమాను పబ్లిక్ లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని విరూపాక్ష మేకర్స్ భావిస్తున్నారట.

పుష్ప 2 తర్వాత కూడా సుకుమార్‌ నుండి ఇతర ప్రాజెక్ట్‌ లకు రచన సహకారం అందక పోవచ్చు. ఎందుకంటే సుకుమార్‌ స్టార్‌ డమ్‌ ఇప్పుడు గతంలో మాదిరిగా కాదు.. ఆయన ఒక పాన్ ఇండియా దిగ్గజ దర్శకుడు. అందుకే చిన్న సినిమాలతో తన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించుకోవద్దని ఆయన భావిస్తూ ఉంటాడు. అందుకే చిన్న సినిమాలకు సుక్కు సార్ గుడ్ బై చెప్పి ఉంటాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News