వంశీ డిజైనర్ గా కుర్ర సుమంత్ కన్ఫాం

Update: 2016-10-06 09:30 GMT
లేడీస్ టైలర్ సీక్వెల్ తీసేందుకు సీనియర్ దర్శకుడు వంశీ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అప్పటి బ్లాక్ బస్టర్ మూవీని లేటెస్ట్ జనరేషన్ కి తగ్గట్లుగా మార్చి.. ఫ్యాషన్ డిజైనర్.. సన్నాఫ్ లేడీస్ టైలర్ పేరుతో తీసేందుకు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకున్నాడు. వంశీ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ మూవీ.. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది.

ఫ్యాషన్ డిజైనర్ లో ముగ్గురు హాటీలు హీరోయిన్లు నటించనుండగా.. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే.. ఫ్యాషన్ డిజైనర్ టైటిల్ రోల్ ని పోషించేందుకు.. మొదట యంగ్ హీరో రాజ్ తరుణ్ ని కన్సిడర్ చేశారు. కానీ ఈ కుర్రాడికి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో.. దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ను ఈ మూవీతో ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇవి కూడా తుది రూపానికి రాలేదు. దీంతో ఇప్పుడు సుమంత్ అశ్విన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడు డైరెక్టర్ వంశీ. ఇప్పటికే మాటలు కూడా పూర్తయిపోగా.. త్వరలో అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.

మధుర శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ కు.. మణిశర్మ మ్యూజిక్ అందించనుండడం విశేషం. ప్రీప్రొడక్షన్ పనుల్లో భాగంగా హీరోయిన్లు ఫైనల్ కాగానే.. ఫ్యాషన్ డిజైనర్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు నిర్మాత రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News