కూతురు గురించి ఎమోషనల్ అయిన సన్నీలియోన్.. అసలు ఏమైంది??

Update: 2020-07-17 17:30 GMT
సన్నీలియోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ కలిగి ఉంది. అడల్ట్ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సన్నీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అది వేరే విషయం. 2011లో హిందీ పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్-5'లో కంటెస్టెంటుగా పాల్గొని.. 2012లో పూజ భట్ దర్శకత్వం వహించిన 'జిస్మ్ 2' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీతారగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుంది. కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీలంతా సినిమా షూటింగులు మానుకొని ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో కూడా ఖాళీగా ఉండలేక ఇలా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.

ఇదిలా ఉండగా.. సన్నీకి ముగ్గురు పిల్లలు. నిషా అని నాలుగేళ్ళ కూతురు ఉంది. నిషాను మహారాష్ట్రలోని లాతూరులో దత్తత తీసుకుంది. ఇక ఇద్దరు మగ కవలపిల్లలు.. నోహ, అశేర్. ఈ ఇద్దరు కవలపిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ప్రస్తుతం సన్నీ తన ముగ్గురు పిల్లలతో మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఈరోజు నిషా పుట్టినరోజు. నిషా పుట్టినరోజును పురస్కరించుకొని సన్నీ తన ఫ్యామిలీతో సెలెబ్రేషన్స్ జరిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేగాక నిషా గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది.

"నిషా.. మూడేళ్ల క్రితం మమ్మల్ని నువ్ తల్లిదండ్రులుగా ఎంచుకున్నావ్. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని మా మీద నమ్మకం ఉంచావు. మాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించేందుకు మా జీవితంలోకి వచ్చావు. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నాకు తెలుసు నువ్వు నా కూతురువి.. నిన్ను ఇప్పుడు చూస్తుంటే జీవితంలో గొప్ప మహిళవి అవుతావని నీ కళ్లల్లో వెలుగు చెబుతోంది. కొంతకాలం తరువాత నువ్ చాలా ప్రశ్నలను ఎదుర్కొంటావ్.. ప్రతీ అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్యూ నిషా'' అని తన దత్త పుత్రికను ఉద్దేశిస్తూ ఎమోషనల్ అయింది. ఇక సన్నీ దంపతులు ఇద్దరు పిల్లలతో దిగిన పిక్స్ షేర్ చేశారు. ప్రస్తుతం సన్నీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    

Similar News