నీ మాటలతో నాకు మాటలు లేకుండా చేశావ్‌

Update: 2019-12-17 11:38 GMT
ఇటీవల జరిగిన 'ప్రతిరోజు పండుగే' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో సాయి తేజ్‌ మాట్లాడుతూ సంగీత దర్శకుడు థమన్‌ గురించి మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ థమన్‌ గురించి మెగా హీరో ఎమోషనల్‌ గా మాట్లాడటం వారిద్దరి మద్య స్నేహంకు నిదర్శనంగా నిలిచింది. నా ఫెయిల్యూర్‌ లో నా వెంట ఉన్నావు. నా సక్సెస్‌ లో కూడా నేవ్వు నాతో ఉండాలంటూ తేజ్‌ చేసిన వ్యాఖ్యలపై థమన్‌ కూడా చాలా ఎమోషనల్‌ గా స్పందించాడు.

ట్విట్టర్‌ లో తేజ్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి.. ఏం చెప్పాలి ?మాట రాని మౌనం తప్ప..డబ్బు,వ్యాపారం అంటూ స్నేహానికి రంగులు మార్చే ఈ రోజుల్లో, అచ్చమైన స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపం ,నా ప్రాణం  “సాయి తేజ్”..నీ కోసం ఎప్పుడైనా,ఏదైనా సిద్ధం మిత్రమా..నీ మాటల్తో నాకు మాటలు లేకుండా చేసావ్..నా గుండెని తడి చేసావ్..లవ్ యూ మై డియర్ బ్రదర్  అంటూ ట్వీట్‌ చేశాడు.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేక పోయాయి. అందుకే తేజ్‌ ను చాలా మంది థమన్‌ తో వద్దని అన్నారట. అయినా కూడా థమన్‌ తో ఉన్న స్నేహంతో ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా తేజ్‌ చెప్పడం.. దానికి థమన్‌ ఎమోషనల్‌ గా ట్వీట్‌ చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ఇక ప్రతి రోజు పండుగే సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌ గా నటించింది. సత్యరాజ్‌ మరియు రావు రమేష్‌ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శతమానం భవతి వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కథతో ఈ చిత్రం రూపొందినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. తేజ్‌ మరియు థమన్‌ ల కాంబోకు ఇది మొదటి సక్సెస్‌ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు.
Tags:    

Similar News