ఆ డైరెక్టరే కథ మార్చాడు: మంచు విష్ణు

Update: 2020-03-27 16:00 GMT
గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ ఇద్దరు పరాజయాలను ఎదుర్కొని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా మళ్లీ కొత్త సినిమాలతో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో రిలీజ్ కి సిద్ధమవుతుండగా, మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాను ఇటీవలే ప్రారంభించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరు బ్రదర్స్ కూడా మంచి జోరులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ను కూడా తెరమీదకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడట.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం కానుంది. ఆయన సినీ కెరీర్ లో ఇంతవరకు ఎదుర్కొన్న ఒడిదుడుకులను, వివాదాలను గురించి మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విష్ణు ప్లాప్ మూవీ 'ఆచార్య అమెరికా యాత్ర' గురించి కొన్ని నిజాలను బయటపెట్టాడు. ఆ సినిమాకి ముందు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ వేరని - షూటింగ్ చేసేటప్పుడు కథను మార్చేశారని చెప్పాడు. కథ విషయంలో డైరెక్టర్ ను నిలదీశానని తెలిపాడు. అంతేగాక ఒక సినిమా ప్లాప్ అవుతుంది అని రషెస్ చూసినప్పుడే తెలిసినట్లు పేర్కొన్నాడు. మరి అది ఏ సినిమానో తెలియాల్సి ఉంది. త్వరలో యూట్యూబ్ లో విడుదల కానున్న ఫుల్ ఇంటర్వ్యూ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Full View
Tags:    

Similar News