మ‌హిళా ఎస్పీపై దొంగ‌ల దాడి

Update: 2015-09-12 09:43 GMT

Full View
నెల్లూరు జిల్లాలో దారుణం జ‌రిగిమంది. దొంగ‌లు ప‌ట్ట‌ప‌గ‌లు ఓ మ‌హిళా ఎస్పీ అధికారిణిపై దాడి చేసి ఆమె న‌గ‌లు చోరీ చేశారు. త‌మిళ‌నాడుకు చెందిన ఐపీఎస్ అధికారిణి ర‌త్న హైద‌రాబాద్‌ లోని అప్పాలో ప‌ని చేస్తున్నారు. శుక్ర‌వారం రాత్రి ఆమె చెన్నై వెళ్లేందుకు సింహ‌పురి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఆమె గూడూరు స్టేష‌న్‌ లో రైలు దిగి చెన్నై వెళ్లేందుకు మ‌రో రైలు ఎక్కాల్సి ఉంటుంది. రైలు శ‌నివారం ఉద‌యం నెల్లూరు రైల్వేస్టేష‌న్‌ కు రాగానే విక‌లాంగులంద‌రూ దిగిపోయారు. బోగీలో సింగిల్ ఉన్న ఎస్పీ ర‌త్న‌ పై ఓ దుండగుడు  దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఆమె వ‌ద్ద ఉన్న రెండు బంగారు గాజులు - ఉంగ‌రాలు - గొలుసు - న‌గ‌దు - ఐడీ కార్డు తీసుకుని గూడూరు రైల్వే స్టేష‌న్‌ లో దిగి ప‌రార‌య్యాడు.

తీవ్రంగా గాయ‌ప‌డిన ర‌త్న గూడూరు స్టేష‌న్‌ లో దిగి అక్క‌డ రైల్వే స్టేష‌న్‌ లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు వెంట‌నే స్థానిక ఆసుప‌త్రిలో వైద్యం చేయించి..మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌కాశం - నెల్లూరు జిల్లాల మ‌ధ్య‌లో ప‌లు రైళ్ల‌లో చోరీలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. రైల్వే పోలీసులు ఎంత నిఘా పెంచినా దండుగుల‌ను ప‌ట్టుకోలేక‌పోతున్నారు. తాజాగా ఓ ఐపీఎస్ అధికారిణి పై దాడి జ‌ర‌గ‌డం దుండగుల చ‌ర్య‌లు ఎలా మితిమీరిపోయాయో తెలుస్తోంది.
Tags:    

Similar News