తాగిన‌ప్పుడు గుర్తుకు రాలేదా ట్వింకిల్..ఇప్పుడు సూక్తులా?

Update: 2022-05-29 08:30 GMT
ఇటీవ‌లే బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ జోహార్ 50వ పుట్టిన రోజు వేడుక‌లు సంద‌ర్భంగా సెల‌బ్రిటీల‌కు గ్రాండ్ గా పార్టీ  ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఆహ్వానం అందిన బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా పార్టీలో పాల్గొన్నారు. మంచు..విందు..ముక్క అంటూ ఆ రాత్రి గ‌ట్టిగానే పార్టీని  ఎంజాయ్ చేసారు. సెల‌బ్రిటీల‌కు మాత్ర‌మే ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ప్ర‌యివేటు పార్టీ కావ‌డంతో ఎవ‌రూ మోహ‌మాట ప‌డ‌లేదు.

అంతా ఒక‌రికి ఒక‌రు తెలిసిన‌వారే. ఇక సిగ్గుప‌డ‌టానికి ఛాన్స్ ఎక్క‌డ‌? ఆ  ఛాన్స్ ఉన్నా  ఒక పెగ్ ఏసిన త‌ర్వాత అన్ని ఎగిరిపోతాయి. మామ ఏక్ పెగ్ లా? అన్న టైపులోనే పార్టీ సాగుతుంది.  తాగిన వాళ్ల‌కు తాగినంత‌..తిన్న వాళ్ల‌కి తిన్నంతా...ఎగిరే వాళ్ల‌కు ఎగిరినంత స‌మ‌యం. ఇలా ఆ రాత్రి పార్టీ ఎంతో గొప్ప‌గా జ‌రిగింది.

ఇక ఆ మ‌రుస‌టి రోజు తెలుస్తుంది?  ఎంత తాగితే అంత హ్యాంగ్ ఓవ‌ర్ అని. స‌రిగ్గా ఇదే సంద‌ర్భాన్ని స‌ర‌దాగా గుర్తు చేసింది బాలీవుడ్ న‌టి ట్వింకిల్ క‌న్నా..అంతే కాదండోయ్ కొన్ని సూస్తులు సైతం వ‌ల్లించింది. ఫ్రీడింక్స్ కార‌ణంగా వ‌చ్చిన హ్యాంగోవ‌ర్  ఇది. పార్టీలో అంద‌రూ ఎక్కువ‌గా మ‌ధ్యం సేవించిందే ఉంటుంది. ఏం గుర్తు లేదు. కాబ‌ట్టి బ్యాన్ డ్రింక్స్. బ్యాన్ పార్టీస్.. బ్యాన్ క‌ర‌ణ్ అంటూ స‌ర‌ద‌గా ఇన్ స్టాలో పోస్ట్  చేసింది.

అయితే  ట్వింకిల్ స‌ర‌దాగా పోస్ట్ చేసినా నెటి జ‌నులు సీరియ‌స్ గానే తీసుకున్నారు. అమ్మ‌డిని ఓ రేంజ్ లో ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఎంత తాగావు? ఏంటి? ఎన్ని రోజులు హ్యాంగోవ‌ర్ తో ఇబ్బంది ప‌డ్డావు.  దానికి విరుడుగా ఇంకెన్ని పెగ్ లు వేసావ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫ్రీగా వ‌స్తే ఎంతైనా తాగేస్తారా? అంటూ అంతే స‌ర‌దాగా..సైటైర్లు గుప్పిస్తున్నారు.

సెల‌బ్రిటీలు ఇలాంటి కామెంట్లు పోస్ట్ చేయ‌డం యువ‌త‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని..వాళ్ల‌ని పెడ‌దొవ‌లో పెట్టిన‌ట్లు అవుతుంద‌ని  మ‌రికొంత  మంది నెటి జ‌నులు మండిప‌డుతున్నారు. అయినా ఈ నీతులు తాగిన‌ప్పుడు గుర్తు లేదా?  తాగింది దిగిన త‌ర్వాత సూక్తులు చెప్పే వాళ్లు పెరిగిపోయారంటూ మండిప‌డుతున్నారు.

అంతేగా!  స‌ర‌దాకి కూడా ఇలాంటి వాటిని ప‌బ్లిక్ చేయ‌కూడ‌దు. చేస్తే సీన్ ఇలాగే  రివ‌ర్స్ అవుతుంది. బోయ్ ప్రెండ్స్ ఇత‌ర విష‌యాల్లో కామెంట్లు ప‌ద్ద‌తిగా ఉంటాయి. మందు..హ్యాంగోవ‌ర్ అంటూ ప‌బ్లిక్ ప్లాట్ ఫాం మీద‌కి ఎక్కితే ఇలాగే ఉంటుంది.

ఇక ట్వింకిల్ ఖ‌న్నా సినిమాలు చేసి చాలా కాల‌మ‌వుతుంది.  దాదాపు ద‌శాబ్ధ కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. నిర్మాత‌గా కొన్ని సినిమాల‌కు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రిగా భ‌ర్త  అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన పాండ్ మాన్ చిత్ర  నిర్మాణంలో  భాగ‌మ‌య్యారు. ఇది 2018లో రిలీజ్ అయింది.  ఆ త‌ర్వాత నిర్మాణానికి దూరంగా ఉన్నారు.
Tags:    

Similar News