వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్ డే పార్టీలో టాప్ సెల‌బ్స్

Update: 2021-07-28 14:42 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్ డే వేడుక‌లు హైద‌రాబాద్ లో వైభ‌వంగా జ‌రిగాయి. పార్టీకి ప‌రిమితంగానే అతిథులు హాజ‌రైనా వేడుక‌ క‌ల‌ర్ ఫుల్ గా జ‌రిగింద‌ని తాజాగా రిలీజైన ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఈ పార్టీకి తెలుగు త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి అతిథులు హాజ‌ర‌య్యారు. అలాగే బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా... ఊపిరి ఫేం కార్తీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. కార్తీ చెన్న‌య్ నుంచి హైద‌రాబాద్ కి ఈ పార్టీ కోసం విచ్చేయ‌డం ఆస‌క్తిక‌రం. నిర్మాత దిల్ రాజు - వైఘారెడ్డి దంప‌తులు.. శిరీష్ అండ్ ఫ్యామిలీ హాజ‌ర‌య్యారు. ఇక స‌ర్కార్ వారి పాట‌లో న‌టిస్తున్న‌ కీర్తి సురేష్ ఈ పార్టీకి హాజ‌ర‌య్యారు. నటి సంగీత తన క్యూట్ డాట‌ర్ తో కలిసి పుట్టినరోజు పార్టీలో పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో పైడిప‌ల్లి స్నేహితుడు మ‌హేష్ మిస్స‌య్యారు.. ఆయ‌న షూటింగ్ బిజీలో అటెండ్ కాలేక‌పోయారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

పైడిప‌ల్లి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మ‌హ‌ర్షి చిత్రం తర్వాతా అత‌డికి బిగ గ్యాప్ వ‌చ్చింది. మ‌హేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల అది వీలుప‌డ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ తో సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ద‌ళ‌పతి కెరీర్ 66వ చిత్ర‌మిది. తెలుగు - తమిళ్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి దిల్ రాజు భారీ బ‌డ్జెట్ ని కేటాయించ‌నున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పైడిప‌ల్లి కెరీర్ ని స్లోలీ అండ్ స్టడీలి అన్న ప్రాతిప‌దిక‌న న‌డిపిస్తుండ‌డం విశేషం. ఇక ఆయ‌న స్వ‌త‌హాగా క‌థార‌చ‌యిత కాదు కాబ‌ట్టి ఇత‌రుల క‌థ‌ల్ని తెర‌కెక్కిస్తాన‌ని దానివ‌ల్ల సినిమాలు ఆల‌స్య‌మ‌వుతాయ‌ని కూడా ఇంత‌కుముందు స్వ‌యంగా వెల్ల‌డించారు.
Tags:    

Similar News