‘ఎన్టీఆర్‌’ కోసం మళ్లీ వచ్చిన విద్యాబాలన్‌

Update: 2018-10-17 03:57 GMT
ఎన్టీ రామారావు జీవితం గురించి సినిమా అంటే అంతా కూడా ఆయన సతీమణి బసవతారకం పాత్రను పది పదిహేను నిమిషాలు చూపిస్తారేమో అని అంతా అనుకున్నారు. అంతకంటే ఎక్కువగా ఆమె గురించి ఏం చూపించగలరని, అసలు ఆమె బయటకు వచ్చిందే లేదు, ఎన్టీఆర్‌ సినిమాలు, రాజకీయం గురించే ఎక్కువ చూపించాలి కనుక ఆమె గురించి అంతకంటే తక్కువ ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపిస్తారని కొందరు భావించారు. కాని దర్శకుడు క్రిష్‌ మాత్రం తన ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బసవతారకం పాత్రను చాలా ఎక్కువగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

సినిమా రెండు పార్ట్‌లు కూడా బసవతారకం కేంద్రంగా సాగుతాయని చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి విశ్వసనీయ సమాచారం అందుతుంది. అందుకే విద్యాబాలన్‌ ఎక్కువ రోజులు చిత్రీకరణలో పాల్గొటున్నట్లుగా తెలుస్తోంది. ‘ఎన్టీఆర్‌’ చిత్రం మొదటి షెడ్యూల్‌ లో దాదాపు రెండు వారాల పాటు చిత్రీకరణలో పాల్గొన్న విద్యాబాలన్‌ ఇప్పుడు మరోసారి ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యాబాలన్‌ మరియు బాలకృష్ణలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’ రెండు పార్ట్‌ లలో కూడా విద్యాబాలన్‌ కీలకంగా కనిపించడంతో పాటు, ఎక్కువ సమయం స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంటుందని సమాచారం అందుతుంది. వచ్చే జనవరిలో సంక్రాంతికి ఎన్టీఆర్‌ కథానాయకుడు, రిపబ్లిక్‌ డే కు ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోందని టాక్‌ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్‌ లో ఇది నిలిచిపోయే సినిమా అవుతుందని నందమూరి ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.
Tags:    

Similar News