చరణ్‌ - బుచ్చిబాబు మూవీ... ఔనన్న బోనీ కపూర్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-02-19 09:20 GMT

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ చేసినట్లుగా దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో నెల రోజుల్లో చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ సమయంలోనే హీరోయిన్‌ ఎవరు అనే విషయమై అనేక రకాల ప్రచారాలు జరిగాయి. ఎన్టీఆర్‌ కి జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్‌ ను చరణ్ కి జోడీగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

బుచ్చిబాబు ఇటీవలే జాన్వీ కపూర్‌ ను కలిసి చరణ్‌ మూవీకి సంబంధించిన కథ మరియు ఆమె పాత్ర గురించి వివరించడం జరిగింది. జాన్వీ కన్ఫర్మ్‌ అవ్వడంతో పాటు ఒప్పంద అంగీకార పత్రాలపై సంతకం కూడా చేసిందని సమాచారం అందుతోంది.

అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎవరు కూడా అధికారికంగా బయట చెప్పలేదు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయమై మౌనంగా ఉన్నారు. కానీ జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఈ విషయమై కుండ బద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చి పుకార్లు అన్నింటికి చెక్ పెట్టేశాడు.

ఇటీవల ఒక జాతీయ మీడియా తో చిట్ చాట్‌ లో బోనీ కపూర్‌ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. తాను జాన్వీ కపూర్‌ కెరీర్‌ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌ తో ప్రస్తుతం సినిమా చేస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్‌ తో ఆమె సినిమా ఉండబోతుందని బోనీ కపూర్ చెప్పాడు.

ఒకప్పుడు చిరంజీవి తో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు చిరంజీవి కుమారుడు రామ్‌ చరణ్ తో మా కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించడం చాలా సంతోషంగా ఉందని బోనీ కపూర్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ విషయమై మరింత స్పష్టంగా, అధికారికంగా బుచ్చిబాబు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News