గుంటూరు కారం : ఆమెను సరిగ్గా వాడి ఉంటారా?

గుంటూరు కారం సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెల్సిందే.

Update: 2024-01-05 06:29 GMT

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమా లో మహేష్‌ బాబుకు జోడీగా మొదట పూజా హెగ్డేను హీరోయిన్‌ గా ఎంపిక చేసి, సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు గాను శ్రీలీలను తీసుకున్నారు. కానీ తర్వాత రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.

గుంటూరు కారం సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెల్సిందే. దాంతో ఆ స్థానంలో శ్రీలీల మెయిన్‌ హీరోయిన్‌ గా మారింది. ఇక సెకండ్ హీరోయిన్‌ పాత్రకి గాను అందమైన మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండటం ఇప్పుడు కొత్తేం కాదు. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత మొదలుకుని మొన్నటి అల వైకుంఠపురంలో నివేదా పేతురాజ్ వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలను సెకండ్‌ హీరోయిన్‌ గా చూపించాడు.

పేరుకు సెకండ్‌ హీరోయిన్‌ కానీ, సినిమాలో వారికి అస్సలు ప్రాముఖ్య ఉండదు. అసలు ఆ పాత్రలు ఎందుకు ఉన్నాయి అనేది చాలా సినిమాల్లో త్రివిక్రమ్‌ సరిగ్గా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో గుంటూరు కారం సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న మీనాక్షి చౌదరికి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఉండక పోవచ్చు అంటున్నారు. తాజాగా విడుదల అయిన గుంటూరు కారం కొత్త పోస్టర్ లో మీనాక్షి చౌదరి చాలా అందంగా కనిపిస్తుంది. కనుక సినిమాలో ఆమె ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మధ్య కాలంలో శ్రీలీలతో పోల్చితే మీనాక్షి చౌదరి అందంగా మరియు సక్సెస్‌ ఫుల్‌ గా కనిపిస్తోంది. అందుకే ఈ అమ్మడికి గుంటూరు కారం లో మంచి స్కోప్‌ దక్కితే భవిష్యత్తుకు బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మీనాక్షి ని త్రివిక్రమ్‌ సరిగ్గా వాడి ఉంటారా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News