ఫ్యామిలీ స్టార్.. దర్శకుడి రేటు పెరిగింది

ఇప్పటికే కార్తికి కథ కూడా నేరేట్ చేసి ఫైనల్ చేసుకున్నాడంట. జపాన్ మూవీ రిలీజ్ తర్వాత కార్తి పరశురామ్ సినిమాపైన ఫోకస్ పెట్టనున్నారంట

Update: 2023-10-19 04:24 GMT

గీతాగోవిందం, సర్కారువారిపాట సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్న పరశురామ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే ఈ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకొంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురాం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వరుస రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ పడటంతో పరశురామ్ రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీకి ఏకంగా 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారంట. ఒక దర్షకుడికి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అంటే ఎక్కువ అని చెప్పాలి. విజయ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే వచ్చే ఏడాది కార్తితో స్ట్రైట్ తెలుగు మూవీ చేయబోతున్నాడంట.

ఇప్పటికే కార్తికి కథ కూడా నేరేట్ చేసి ఫైనల్ చేసుకున్నాడంట. జపాన్ మూవీ రిలీజ్ తర్వాత కార్తి పరశురామ్ సినిమాపైన ఫోకస్ పెట్టనున్నారంట. ఈ సినిమాకి అయితే ఏకంగా 20 కోట్ల వరకు దర్శకుడు పరశురామ్ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారంట. ఇప్పటికే ఈ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే కార్తి కూడా ఇప్పటి వరకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే అధికంగా కార్తి మూవీ కోసం చార్జ్ చేస్తున్నారంట.

ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన కార్తి ఈ సారి సోలోగా సక్సెస్ అందుకొని తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. కార్తి నటించిన ఖాకీ, ఖైది, సర్దార్ లాంటి సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

చాలా గ్యాప్ తీసుకొని కార్తి స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా విశేషమని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ అయితే కార్తి ఇమేజ్ టాలీవుడ్ లో కూడా దూసుకుపోతుంది. మరి దీనిని కోలీవుడ్ హీరో ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News