గేమ్ ఛేంజర్.. అతి పెద్ద క్లయిమాక్స్!

ఇప్పటివరకు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు లేనంత గ్రాండియర్ క్లైమాక్స్ ను శంకర్ వెండి తెర పై చూపించబోతున్నాడట.

Update: 2023-08-05 09:09 GMT

దర్శకుడు శంకర్ ఒకప్పుడు ఫ్యాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్థం తీసుకువచ్చిన టాప్ ఫిలిం మేకర్ అని చెప్పవచ్చు. అయితే 2.0 తర్వాత మాత్రం ఆయన అనుకున్నంత స్థాయి లో అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇక మొదటిసారి ఆయన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా గ్రాండ్ గానే మొదలైనప్పటికీ కూడా ఇంకా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో భారీ హైప్ అయితే క్రియేట్ కావడం లేదు.

ఇప్పటివరకు హీరో ఫస్ట్ లుక్ కి సంబంధించి ఒక పోస్టర్ వదిలారు. ఇక తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. ఈ విషయంలో దిల్ రాజు పై కూడా ఫ్యాన్స్ ఆగ్రహంతోనే ఉన్నారు. అసలు సినిమా ఎంతవరకు వచ్చింది అనే విషయంలో కూడా ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ శంకర్ మాత్రం తన పని తాను చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఐదు సాంగ్స్ కు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయట. తమన్ కంపోజ్ చేసి నెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసి ఎక్కువగా గేమ్ చెంజర్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఒక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ చేసిన శంకర్ అతి పెద్ద క్లైమాక్స్ ను అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు లేనంత గ్రాండియర్ క్లైమాక్స్ ను శంకర్ వెండి తెర పై చూపించబోతున్నాడట. దాదాపు 500 మందితో ఒక భారీ ఫైట్ సీన్ కూడా షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. దానికోసం దిల్ రాజు కూడా ఎక్కడా తగ్గకుండానే ఖర్చు చేశారని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.

ఒక విధంగా దిల్ రాజు ఈ సినిమా పై అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే భారీగా పెట్టుబడి పెడుతున్నాడు. మొదట 220 కోట్ల రేంజ్ లో ఈ సినిమా ను పూర్తి చేయాలని అనుకున్నారు కానీ ఆ తర్వాత బడ్జెట్ ఊహించని విధంగా 250 కోట్లు దాటింది. ఈఓ 270 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేసి 2024 సమ్మర్ మొదట్లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News