గుంటూరు కారం : ఆ రూ.10 కోట్ల యాక్షన్ ఎప్పుడు?

సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

Update: 2024-01-14 09:15 GMT

సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు ఈ సినిమానే సాధించినట్లుగా కూడా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ఏడాది క్రితం సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసి ఆ చేజింగ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

తీరా సినిమాలో చూస్తే ఆ భారీ చేజింగ్ యాక్షన్ సన్నివేశాన్ని పెట్టలేదు. ఎడిటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని లేపేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని యూట్యూబ్‌ ద్వారా అయినా విడుదల చేయాలని మహేష్ బాబు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కొందరు మాత్రం ఓటీటీ వెర్షన్ కు ఆ యాక్షన్ సన్నివేశాన్ని పెట్టాలని కోరుతున్నారు. మొత్తానికి ఆ యాక్షన్‌ సన్నివేశం ను గుంటూరు కారం లో చూడాలని లేదంటే యూట్యూబ్‌ ద్వారా అయినా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమా లో హీరోయిన్‌ గా శ్రీలీల నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన గుంటూరు కారం పై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేశారని నిర్మాతల్లో ఒకరు అయిన నాగ వంశీ ఆరోపించాడు.

Tags:    

Similar News