గుంటూరు కారం.. బిజినెస్ డీల్స్ షురూ..

అయితే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా నిర్మాతలు త్వరలోనే ఒక నిర్ణయానికి రాబోతున్నారు.

Update: 2023-11-13 05:34 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు విడుదల డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైపోయింది. తమన్ స్వరపరిచిన ఒక సాంగ్ ధమ్ మసాలా కూడా విడుదలైంది.

అయితే సాంగ్ బాగానే ఉన్నప్పటికీ అల.. వైకుంటపురములో.. సాంగ్స్ రేంజ్ లో అయితే ఇది వెబ్ క్రియేట్ చేయలేకపోతోంది. మొత్తానికి సినిమాపై అంచనాలు అయితే తగ్గడం లేదు. ఎన్నోసార్లు రీ షూట్స్ చేసినా హీరోయిన్ మారినా టెక్నీషియన్ తప్పికున్నా కూడా సినిమాకు అదే పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది.

తప్పకుండా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా నిర్మాతలు త్వరలోనే ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బడ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక మహేష్ బాబుకు ఎంతో పట్టున్న నైజం ఏరియాలోనే గుంటూరు కారం సినిమా దాదాపు 45 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాలో కూడా లెక్క 50 కోట్లు దాటే అవకాశం ఉంది. సీడెడ్ ఏరియా నుంచి 25 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ బయ్యర్స్ 22 కోట్ల రేంజ్ లో డీల్ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి నిర్మాతలు ఆ ఏరియా డీల్ విషయంలో ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉంది.

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుంటూరు కారం సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఈ డీల్స్ సెట్టయితే మహేష్ బాబు కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అవుతుందని చెప్పవచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ డీల్స్ విషయంలో కూడా త్వరలోనే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చర్చలు జరపనున్నారు. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా సినిమాకు సాలీడ్ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

Tags:    

Similar News