బాధిత మ‌హిళ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జానీ మాస్ట‌ర్ భార్య‌!

భ‌ర్త‌ని ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌కుండా కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. కావాల‌నే త‌ప్పుడు కేసులో ఇరికించి ఇబ్బందులుకు గురిచేస్తున్నారన్నారు.

Update: 2024-09-22 09:28 GMT

లైంగిక ఆరోప‌ణ‌ల కేసులో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌త తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 14 రోజుల పాటు ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేసారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జానీ మాస్ట‌ర్ భార్య అయేషా బాధిత యువ‌తిని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

త‌న భ‌ర్త‌ని ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌కుండా కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. కావాల‌నే త‌ప్పుడు కేసులో ఇరికించి ఇబ్బందులుకు గురిచేస్తున్నారన్నారు. జానీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ త‌ప్పుడు ఎలిగేషన్ అన్నారు. మొన్న రేవు పార్టీ అంటూ జానీ పేరు తెర‌పైకి తెచ్చారు. నేడు లైంగిక ఆరోప‌ణ‌లంటూ మ‌రో కొత్త కేసు తెచ్చారన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, ' ఆ అమ్మాయికి ట్యాలెంట్ ఉంద‌ని భావించే జానీ ఆమెకి అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ గా అవ‌కాశం ఇచ్చాడు.

స్టేజ్ పై డ్యాన్సులు చేసుకునే అమ్మాయికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది. అనేళ్ల‌గా లైంగిక దాడి జ‌రుగుతుంటే ఇన్నాళ్లు సైలెంట్ గా ఎందుకు ఉంది? అప్పుడెందుకు బ‌య‌ట పెట్ట‌లేదు? 16 ఏళ్ల‌కే అత్యాచారం చేస్తే అప్పుడు గుర్తు రాలేదా? ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి' అంటూ అయేషా ఆరోపించారు.

త‌న భ‌ర్త‌ నిర్దోషి అని ఎలాంటి పాపం తెలియ‌ద‌ని...దోషిగా నిర్ధారిస్తే త‌న భ‌ర్త‌ను వ‌దిలేస్తాన‌ని అయేషా ఇంత‌కు ముందు మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు నార్సింగ్ పోలీస్ స్టేష‌న్ కు హాజ‌రైన స‌మ‌య‌లో ఫేక్ కాల్ విష‌యంలో స్టేష‌న్ కి వెళ్లిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News