తిరుమల లడ్డూ వివాదంపై ప్రణీత సుభాష్... ఫ్యాన్స్ నోట శభాష్!

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూపై జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-20 06:19 GMT

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూపై జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో మొదలైన ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పరిస్థితి. దీంతో... గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఏమి జరిగిందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సినిమా హీరోయిన్ ప్రణీత స్పందించారు.

అవును... ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ హీరోయిన ప్రణీత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... “శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇది స్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది” అని అన్నారు.

వాస్తవానికి ప్రణీత రెగ్యులర్ గా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువల గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో పంచుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల లడ్డూపై నడుస్తున్న వ్యవహారంపైనా స్పందించారు. ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ వివాదంపై మొదటిగా స్పందించినందుకు ఆమెను నెటిజన్లు, అభిమానులు అభినందిస్తున్నారు.

కాగా... గత ప్రభుత్వ హయాంలో స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. ఇందులో భాగంగా.. లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలగలిపి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.డీ.డీ.బీ) కాఫ్ లిమిటెడ్ కంపెనీ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News