రోడ్డు ప్రమాదం.. ప‌వ‌న్ హీరోయిన్ భ‌ర్త‌ ICUలో

దబాస్ సహ స్థాపన చేసిన 'ప్రో పంజా లీగ్' ఈ దుర్ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని సారాంశం ఇలా ఉంది.

Update: 2024-09-21 09:31 GMT

శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు పర్విన్ దబాస్ ముంబై- బాంద్రా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతడి భార్య, ప్ర‌ముఖ హీరోయిన్ ప్రీతి జింగానియా అతడితో ఉన్నారు. డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నార‌ని తెలిసింది. ఐసీయులో అత‌డి కండిష‌న్ క‌ద‌ల్లేని స్థితిలో ఉన్నాడ‌ని ప్రీతి జింగానియా తెలిపారు.

దబాస్ సహ స్థాపన చేసిన 'ప్రో పంజా లీగ్' ఈ దుర్ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని సారాంశం ఇలా ఉంది. ''ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్విన్ దబాస్ శనివారం తెల్లవారుజామున దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో ఆసుపత్రి పాలయ్యారని .. బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో ఉన్నారని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. సంఘటనకు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే మిస్ట‌ర్ ద‌బాస్ ప్రస్తుతం వైద్య సహాయం పొందుతున్నారు. ఈ సవాల్ సమయంలో మా ఆలోచనలు పర్విన్ అతడి కుటుంబంతో ఉన్నాయి. ప్రో పంజా లీగ్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. తగిన విధంగా అప్‌డేట్‌లను అందిస్తుంది. మిస్టర్ దాబాస్ అతడి ప్రియమైన వారి కోసం దయచేసి గోప్యతను అభ్యర్థిస్తున్నాము. పర్విన్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం'' అని రాసారు.

ప‌ర్వీన్ భార్య ప్రీతి జింగానియా ఈ ప్ర‌మాదం గురించి తెలిసి షాక్‌లో ఉన్నామ‌ని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన మెడికల్ అప్‌డేట్ ప్ర‌కారం.. అత‌డికి తీవ్రమైన కండిషన్ ఉందని, ఇంకేమైనా డ్యామేజ్ అవుతుందేమోనని వైద్యులు CT స్కాన్‌లు ఇతర పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అతడు పెద్దగా కదలలేకపోతున్నాడు. లీగ్‌తో పనిభారం ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట పని చేస్తూ తెల్లవారుజామున వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు'' అని తెలిపారు.

పర్విన్ దబాస్ తన నటనా జీవితాన్ని 1999లో 'దిల్లగి' చిత్రంతో ప్రారంభించాడు. అయితే 2001లో మీరా నాయర్ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'మాన్‌సూన్ వెడ్డింగ్'తో మంచి కీర్తిని పొందాడు. ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై, ఖోస్లా కా ఘోస్లా వంటి చిత్రాలలో నటించాడు. అతడి నటనకు ప్రత్యేకంగా ప్రశంస‌లు ద‌క్కాయి. బాలీవుడ్‌తో పాటు, మలయాళం, కన్నడ చిత్రాలలోను ప‌ర్విన్ న‌టించారు. నటనతో పాటు పర్విన్ నిర్మాత‌గాను కొన‌సాగారు. 2011లో సాహి ధంధే గలాత్ బండేతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కొన్ని చలన చిత్రోత్సవాలలో అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. అతడు శిక్షణ పొందిన స్కూబా డైవర్.. నీటి అడుగున ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ‌. పర్విన్ ది MMA ఇండియా షో వ్యవస్థాపకుడు.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌పైనా అత‌డు దృష్టి సారించాడు. ఈ రంగంలో అతడు క్రీడలోని ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తాడు.

మొహబ్బతీన్ పాత్రతో బాలీవుడ్ లో పాపుల‌రైన నటి ప్రీతి జింగానియాని ప‌ర్వీన్ వివాహం చేసుకున్నాడు. 2008లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు జైవీర్ అనే కుమారుడు ఉన్నాడు. అలాగే ప్రీతి జింగానియా తెలుగు వారికి సుప‌రిచితురాలు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'త‌మ్ముడు' చిత్రంలో ఈ బ్యూటీ న‌టించింది. ఆరంభ చిత్రంతోనే మ‌న‌సులు గెలుచుకుంది.

Tags:    

Similar News