మేడ‌మ్ టుస్సాడ్స్‌లో చ‌ర‌ణ్ కాదు రైమ్ వెరీ స్పెష‌ల్

అత‌డి మైనపు విగ్రహాన్ని త్వ‌ర‌లో మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించనున్నారు.

Update: 2024-09-29 16:23 GMT

గ్లోబ‌ల్ అప్పీల్ ఉన్న‌ ప్రతిష్ఠాత్మ‌క మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్ప‌టికే టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ల మైన‌పు విగ్ర‌హాలు కొలువు దీరి ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, అల్లు అర్జున్, కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌హా ప‌లు భాష‌ల‌కు చెందిన‌ స్టార్ హీరోల విగ్ర‌హాలను ఆవిష్క‌రించారు.

ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ టైమ్ వ‌చ్చింది. అత‌డి మైనపు విగ్రహాన్ని త్వ‌ర‌లో మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించనున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆసక్తికరంగా చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హంతో పాటు, ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్రత్యేక అతిథి టుస్సాడ్స్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని తెలిసింది.

అందరికీ షాకిచ్చేలా మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ విగ్ర‌హంతో పాటు, అత‌డి ప్రియాతి ప్రియ‌మైన బొచ్చు కుక్క‌పిల్ల‌ రైమ్ విగ్ర‌హాన్ని కూడా జ‌త చేస్తార‌ట‌. దీని కోసం అచ్చు వేసే ప్రక్రియ ప్రస్తుతం కొన‌సాగుతోంది. చ‌ర‌ణ్‌ ఇప్పటికే తన కొలతలను అందించారు. అతడు తన మైనపు బొమ్మ నిర్మాణానికి చురుకుగా స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిసింది. ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చ‌ర‌ణ్‌- రైమ్ జోడీ మైన‌పు విగ్ర‌హాన్ని త్వ‌ర‌గా చూసేయాల‌ని వారంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మైన‌పు విగ్ర‌హం టుస్సాడ్స్ లో ఉన్న సంగతి విధిత‌మే.

ఈ ఏడాది మార్చిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. అదే రోజున తన మొదటి చిత్రం `గంగోత్రి` విడుదలై 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ‌న్ని ఎమోషనల్ నోట్‌ను కూడా రాశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ న‌టించిన `గేమ్ ఛేంజర్` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన‌ ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. ఎస్‌.జె సూర్య, శ్రీకాంత్, జయరామ్ త‌దిత‌రులు న‌టించారు.

Tags:    

Similar News