సలార్ 2 ప్లాన్స్.. ఆ రేంజ్ లో ఉన్నాయా?

ఇక సలార్ పార్ట్ 2 ఉంటుందనే విషయాన్ని ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అలాగే మూవీ క్లైమాక్స్ లో శౌర్యంగ పర్వం అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.

Update: 2024-01-17 13:30 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంద. దేశ వ్యాప్తంగా 700 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చేసింది. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి 2 తర్వాత చెప్పుకోదగ్గ సినిమాగా సలార్ మూవీ నిలిచింది. ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఎంత అనేది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు.

అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడం వలన సలార్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేకపోయింది అనే మాట డార్లింగ్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఇక సలార్ పార్ట్ 2 ఉంటుందనే విషయాన్ని ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అలాగే మూవీ క్లైమాక్స్ లో శౌర్యంగ పర్వం అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ చేస్తారంట.

అంటే కరెక్ట్ గా రెండేళ్ళ తర్వాత సలార్ 2ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించి 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ఈ ఏడాదిలోనే మిగిలిన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్రశాంత్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఈ ఏడాదిలో ప్రశాంత్ నీల్ తారక్ తో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు.

దీనికి కథ ఇప్పటికే సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి సలార్, తారక్ మూవీస్ లో ఏది ముందుగా ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేస్తాడు అనేది మార్చి తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందంట. ఇక సలార్ 2 కోసం హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 250 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ ఫినిష్ చేయాలి. మరో వైపు కల్కి మే9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ పై ఫోకస్ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News