.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

సుధీర్ బాబు.. పాన్ ఇండియాలో మరో కొత్త ప్రయోగం

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా కొత్త తరహా విజువల్స్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు తన డైనమిక్ రోల్ తో ఆకట్టుకోబోతున్నాడు.

Update: 2024-07-01 12:24 GMT

సుధీర్ బాబు పాన్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతఙ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇండియా వరల్డ్ లో కూడా అతను ప్రయోగాత్మకమైన సినిమాలతోఅదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా కొత్త తరహా విజువల్స్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు తన డైనమిక్ రోల్ తో ఆకట్టుకోబోతున్నాడు. ఇటీవల 'హరోం హరా' వంటి యాక్షన్ చిత్రం తో మంచి టాక్ సొంతం చేసుకున్న సుధీర్, ఈసారి కొత్త కోణంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా ఒక ప్రముఖ స్టూడియోతో కలిసి నిర్మిస్తున్నారు. రుస్తోమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్ మరియు పారి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను వీరు నిర్మించారు. ఇక అగ్రబాలీవుడ్ నటి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రం, ప్రాచీన రహస్యాలు మరియు దాగిన నిధుల నేపథ్యంలో మంచి మరియు చెడు శక్తుల మధ్య జరిగిన యుద్ధాన్ని చూపిస్తూ ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుందట.

ఇక సినిమాను 2025 మార్చిలో శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది ఆ సంవత్సరం పాన్-ఇండియా విడుదలల్లో అతిపెద్ద చిత్రంగా నిలవనుందట. ఈ విషయంలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. గత సంవత్సరం నుండే ఈ స్క్రిప్ట్ మరియు జానర్ లో నేను పూర్తిగా లీనమై ఉన్నాను. ఈ థ్రిల్లింగ్ ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.

Read more!

ప్రేరణ అరోరా, మా టీమ్ మరియు నేను ఈ సినిమాను ప్రపంచ స్థాయి అనుభవంగా మలచడానికి మనసు పైన పెట్టి పనిచేస్తున్నాము. ఈ కథ ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది అని నమ్మకం.. ఉందని అని అన్నారు. నిర్మాతలు ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, మరియు ఉజ్వల్ ఆనంద్ ఈ విభిన్నమైన ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మించేందుకు కలసి పనిచేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను 2024 ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. ఈ పాన్-ఇండియా థ్రిల్లర్ ఆధ్యాత్మిక రహస్యాలు, అద్భుతమైన విజువల్స్ మరియు స్టార్ స్టడెడ్ కాస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట. ఈ చిత్రం, పురాతన రహస్యాలు మరియు సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ ను కూడా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News