రణం హీరోయిన్ గుర్తుందా.. గ్లామర్ డోస్ ఇంకా తగ్గలేదు

రణం సినిమాలో గోపీచంద్ కి జోడీగా నటించిన కామ్నా జెఠ్మలానీ అంత ఈజీగా ఎవరు మరిచిపోరు.

Update: 2024-09-05 14:30 GMT

రణం సినిమాలో గోపీచంద్ కి జోడీగా నటించిన కామ్నా జెఠ్మలానీ అంత ఈజీగా ఎవరు మరిచిపోరు. ప్రేమికులు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ రెండో సినిమాగా గోపీచంద్ రణం చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత కామ్నా జెఠ్మలానీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలాగే 2010లో బెండు అప్పారావు RMP సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.


దీని తర్వాత మరల శ్రీ జగద్గురు ఆదిశంకర, భాయ్ చిత్రాలలో కీలక పాత్రలలో కనిపించింది. 2014లో ఈ బ్యూటీ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మెన్ సూరజ్ నాగ్‌పాల్‌ ని వివాహం చేసుకుంది. 2015లో చంద్రిక అనే సినిమాలో కామ్నా జెఠ్మలానీ చివరిగా హీరోయిన్ పాత్రలో నటించింది. తరువాత మూవీస్ కి గ్యాప్ ఇచ్చి మరల 2022లో కన్నడ మూవీ గరుడతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.


గత ఏడాదిలో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో సంపత్ రాజ్ భార్యగా ఆమె కనిపించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా షార్ట్ వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే తన గ్లామరస్ ఫోటోలని కూడా పంచుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో షర్టు వేసుకొని చాలా స్టైలిష్ గా ఫోటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూస్తుంటే కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా కామ్నా జెఠ్మలానీ ఉందనే మాట వినిపిస్తోంది. సరైన క్యారెక్టర్స్ పడితే నటిగా కామ్నా బిజీ అయ్యే అవకాశం ఉందనే మాట ఈ లుక్స్ చూస్తుంటే అనిపిస్తోంది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్ లో సరైన బ్రేక్ కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News