రేవంత్ ను కార్డు తో కలిసిన మల్లారెడ్డి... తెరపైకి హైడ్రా ప్రస్థావన?

నిన్న మొన్నటి వరకూ ఉప్పు నిప్పు గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి మల్లారెడ్డి సమావేశం అయ్యారు!

Update: 2024-10-09 07:17 GMT

పాలమ్మినా.. పూలమ్మినా.. అనే డైలాగ్ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, మొత్తం తెలుగు రాజకీయాల్లోనే ఆన్ లైన్ లో ఫుల్ ఫేమస్ అయిన మాజీ మంత్రి, బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఆ సంగతి అలా ఉంటే... ఆయన తాజా తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని కలిశారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... నిన్న మొన్నటి వరకూ ఉప్పు నిప్పు గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి మల్లారెడ్డి సమావేశం అయ్యారు! సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన మల్లారెడ్డి.. తన మనవరాలి పెళ్లి ఉందని చెప్పి వివాహ పత్రిక ఇచ్చేందుకు సీఎం ఇంటికి వచ్చినట్లు స్పష్టం చేశారు! అంతకు మించి ఏమీ లేదని అన్నారు!

అయితే... ఇప్పటికే ఈ వివాహపత్రికతో చంద్రబాబును కలిసినట్లు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు! ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి చంద్రబాబుని కలిశారని.. త్వరలో వీరు టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే... కేవలం పెళ్లికి పిలవడానికే వెళ్లినట్లు మల్లా రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

మరోపక్క హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా దాడుల నుంచి తమను చంద్రబాబు ఒక్కరే కాపాడగలరని మల్లారెడ్డి & కో భావిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో... తమ విద్యా సంస్థలపై హైడ్రా దాడులు జరిగే అవకాశం ఉందనే విషయంపైనా చర్చించి.. చంద్రబాబుని మల్లారెడ్డి రిక్వస్ట్ చేశారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా నడుస్తుంది!

ఏది ఏమైనా... కారణం మరేదైనా... అటు చంద్రబాబుని, ఇటు రేవంత్ రెడ్డిని బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. పలు ఊహాగాణాలను, మరిన్ని రాజకీయ చర్చలకు వేదికైంది!

Tags:    

Similar News