వేలానికి మోడీ బర్త్ డే బహుమతులు... కనిష్ట ధర రూ.600!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టి నరోజు సందర్భంగా ఆయనకు అందిన 600కు పైగా బహుమతులు వేలం నేటి నుంచి ప్రారంభమవుతోంది.

Update: 2024-09-17 05:02 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టి నరోజు సందర్భంగా ఆయనకు అందిన 600కు పైగా బహుమతులు వేలం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ వేలం అక్టోబర్ 2 (మహాత్మ గాంధీ జయంతి) వరకూ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.

అవును... ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా ఆయనకు అందిన 600కు పైగా బహుమతులను నేటి నుంచి వేలం వేయనున్నారు. ఇందులో పారా ఒలింపిక్ పతక విజేతల వస్తువుల నుంచి రామ మందిరం ప్రతిరూపం, వెండి వీణ వరకూ ఉన్నాయి. వేలం పెట్టనున్న ఈ వస్తువుల మొత్తం బేస్ ధర రూ.1.5 కోట్లు ఉంటుందని షెకావత్ తెలిపారు.

ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో ప్రధాని మోడీ అందుకున్న మెమొంటోలను ప్రదర్శించే ప్రదర్శన్నను సందర్శించిన షెకావత్... ఈ బహుమతులను వేలం వేయడానికి ప్రభుత్వ కమిటీ బేస్ ధర నిర్ణయిస్తుందని.. వీటి ధరలు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకూ ఉంటాయని తెలిపారు.

ఇలా ప్రధానికి వచ్చిన బహుమతులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును ఓ ఉదాత్తమైన పనికి వినియోగిస్తామని అన్నారు. ఇందులో భాగంగా... గంగానది ప్రక్షాళన జరుగుతున్న వేళ.. జాతీయ గంగా నిధికి విరాళంగా అందజేస్తామని షెకావత్ తెలిపారు. "పీఎంమెమెంటోస్.జీవోవీ.ఇన్" ని సందర్శించడం ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఈ బహుమతుల్లో పారాఒలింపిక్ కాంస్య పతక విజేత నిత్యా శ్రీ శివన్, సుకాంత్ కదంల బ్యాడ్మింటన్ రాకెట్, రజత పతక విజేత యోగేష్ ఖతునియా డిస్కస్ కూడా ఉన్నాయి. వాటి బేసిక్ ధర సుమారు రూ.5.50 లక్షలుగా నిర్ణయించారు. ఇక అజిత్ సింగ్, సిమ్రాన్ శర్మ, నిషాద్ కుమార్ లు బహుమతిగా ఇచ్చిన షూస్ ధర రూ.2.86 లక్షలుగా ఉంది!

ఇక... రామాలయ ప్రతిరూపం ధర రూ.5.50 లక్షలుగా ఉండగా.. నెమలి విగ్రహం ప్రారంభ ధర రూ.3.30 లక్షలు, రాం దర్బార్ విగ్రహం ధర రూ.2.76 లక్షలు, వెండి వీణ రూ.1.65 లక్షలుగా ఉందని అంటున్నారు! వీటితో పాటు టోపీ, శాలువాల అత్యల్ప బేస్ ధర రూ.600 గా ఉంది. ఈ వేలం నేటితో మొదలై అక్టోబర్ 2న ముగుస్తుంది.

Tags:    

Similar News