జోరు పెంచుతున్న పవన్ ....ఈసారి గట్టిగానే....!

ఇపుడు పవన్ తన జోరు పెంచుతున్నారు. లేటెస్ట్ గా పవన్ ప్రచారానికి సంబంధించి జనసేన రూట్ మ్యాప్ ని రెడీ చేసింది

Update: 2024-04-19 03:53 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం దూకుడుగా అయితే సాగలేదు. ఆయనకు జ్వరం రావడం అనారోగ్య ఇబ్బందులు తలెత్తడంతో అనకాపల్లి తెనాలి వంటి చోట్ల మాత్రమే ప్రచారం చేశారు. ఈ మధ్యలో చంద్రబాబుతో కలసి ఉమ్మడిగా గోదావరి క్రిష్ణా జిల్లాలలో ప్రచారం చేపట్టారు.

ఇపుడు పవన్ తన జోరు పెంచుతున్నారు. లేటెస్ట్ గా పవన్ ప్రచారానికి సంబంధించి జనసేన రూట్ మ్యాప్ ని రెడీ చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ గట్టిగానే ఉండబోతోంది అని అంటున్నారు.

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలతో ఏపీ మొత్తం పవన్ పర్యటిస్తారు అని అంటున్నారు. అంతే కాదు పవన్ రోజుకి రెండుకు తక్కువ లేకుండా ప్రచార సభలలో పాలుపంచుకుంటారు అని అంటున్నారు. ఈ ప్రచారం కూడా జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారు అని అంటున్నారు.

అదే విధంగా ఇదే నెలలో ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలలో కూడా జనసేనాని పవన్‌ పాల్గొంటారు అని అంటున్నారు. అలాగే మధ్య మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి మరి కొన్ని సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అని జనసేన పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి.

నామినేషన్ల పర్వం ఏపీలో మొదలైంది. ఇప్పటిదాకా ప్రచారం ఒక ఎత్తు. ఇక మీదట మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. రానున్న కొద్ది రోజులు చాలా కీలకం. అందుకే అభ్యర్థుల నామినేషన్లు ఒక వైపు జోరుగా సాగుతూంటే పవన్ ఎన్నికల ప్రచారం కూడా మరో వైపు స్పీడెక్కించనున్నారు అని అంటున్నారు. అలా ఏపీ అంతా చుట్టి రావాలని ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి టీడీపీ కూటమికి పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయాలని పవన్ భావిస్తున్నారట. సో ఏపీలో ఈ నెల 20 నుంచి జనసేనాని సుడిగాలి పర్యటన కి రంగం సిద్ధం అయింది అన్న మాట.

Tags:    

Similar News