వీడెంత ఎదవంటే? సూసైడ్ చేసుకుంటానంటే ఆన్ లైన్ లో పేమెంట్ చేశాడు

ఈ క్రమంలో తాను చనిపోతానని బాధితురాలు చెప్పగా.. చస్తే చావు.. నా పెళ్లికి అడ్డురాకంటూ కటువుగా చెప్పేశాడు.

Update: 2024-10-23 05:30 GMT

వీడ్నేం చేయాలన్నంత కోపం.. ఆవేశం తన్నుకు వస్తుంది ఈ ఉదంతం గురించి తెలిసినంతనే. ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో.. ఈ కాన్సెప్టుకు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఫాలో అవుతున్నారు. క్లారిటీతో ఈ పని అయితే ఓకే. అందుకు భిన్నంగా.. ప్రేమించిన అమ్మాయిని వదిలేసి.. మరొకరిని పెళ్లిచేసుకోవటం ఒక దుర్మార్గం అయితే.. ఈ తీరును ప్రశ్నించటమే పాపమన్నట్లుగా వ్యవహరించి.. వేదనతో చచ్చిపోతానంటే.. చావు.. అంటూ ఆన్ లైన్ పేమెంట్ ద్వారా పురుగుల మందు కొనిచ్చిన దుర్మార్గం కాకినాడలో చోటు చేసుకుంది. దీంతో.. వేదనతో పురుగుల మందు సేవించిన ప్రియురాలు ప్రాణాలు తీసుకున్న విషాద ఉదంతమిది.

కాకినాడకు చెందిన 24 ఏళ్ల యువతికి.. ఇసుకపల్లికి చెందిన ఉమామహేశ్వరరావుకు 2017 నుంచి లవ్ మ్యాటర్ నడుస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మిస్తూ ఉండేవాడు. చనువుగా వ్యవహరించిన ఇతను.. ఇటీవల కాలంలో పెద్దలు తమ పెళ్లికి నో చెప్పారంటూ తప్పుకున్నాడు. మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా ప్రియురాలికి తెలీటం.. తెలిసిన వెంటనే ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో తాను చనిపోతానని బాధితురాలు చెప్పగా.. చస్తే చావు.. నా పెళ్లికి అడ్డురాకంటూ కటువుగా చెప్పేశాడు. దీంతో వేదనతో పురుగుల మందు షాపునకు వెళ్లిన ఆమె.. పురుగుల మందు కొనేందుకు వెళ్లినట్లుగా ప్రియుడికి సమాచారం ఇచ్చింది. ఆమె పురుగుల మందుకు అవసరమైన డబ్బుల్ని ఆన్ లైన్ ద్వారా పే చేశాడు. ఇతగాడి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అమ్మాయి తరఫు వారు పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అతనికి రిమాండ్ విధిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రేమికుడిలోని ఈ కసాయితనాన్ని తెలుసుకున్న వారంతా విస్మయానికి గురవుతున్నారు.

Tags:    

Similar News