వరంగల్ లో గ్యాంగ్ రే*ప్.. ఆలస్యంగా బయటకు

ఆలస్యంగా బయటకు వచ్చిన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వరంగ్ లో జరిగిన సామూహిక అత్యాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

Update: 2024-10-02 04:58 GMT

ఆలస్యంగా బయటకు వచ్చిన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వరంగ్ లో జరిగిన సామూహిక అత్యాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలిసిన ఫ్రెండే కదా అని అతడితో వెళితే.. స్నేహితులతో కలిసి అతడు గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గం బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే..

భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఒక యువతి వరంగల్ శివారులోని ఒక ప్రైవేటు కాలేజీలో ఫార్మసీ చదువుతోంది. కాలేజీకి దగ్గర్లోనే హాస్టల్ వద్ద ఉంటోంది. సెప్టెంబరు 15న ఆమె తన సొంతూరుకు చెందిన ఒక కుర్రాడు హాస్టల్ వద్దకు వచ్చాడు. ఒకే ఊరు కావటంతో మాట్లాడింది. ఈ క్రమంలో మాట్లాడాలంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అయితే. కారులో అతడితో పాటు.. అతడి ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో ఆమె అభ్యంతరం చెప్పింది. అయినప్పటికీ బలవంతంగా తమతో తీసుకెళ్లారు.

వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జిలో గదిని తీసుకున్నారు. అక్కడ ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించి..ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన దాని గురించి ఎవరికి చెప్పినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనికి తోడు పరీక్షలు ఉండటంతో ఆమె తనకు జరిగిన దారుణాన్ని మనసులోని పెట్టుకొని కుమిలిపోయింది. సెలవులకు ఇంటికి వెళ్లిన బాధితురాలు తల్లితో జరిగింది చెప్పి తన వేదనను వ్యక్తం చేసింది.

దీంతో.. బాధితురాలు.. ఆమె తల్లి కలిసి వరంగల్ పోలీసు కమిషనర్ ను కలిసి జరిగిన దారుణం గురించి వివరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమేరా ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. లాడ్జిలో స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డుల ప్రకారం ఒక యువకుడిది భూపాలపల్లిగా గుర్తించారు. బాధితురాలి మిత్రుడితో పాటు.. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News