మత్తులో క్యాసినో కోసం స్టార్ హోటల్ కు వెళ్లి పాడుపని.. ఫైన్ వేసిన సింగపూర్ కోర్టు

కాసేపు గ్యాంబ్లింగ్ ఆడిన తర్వాత బాత్రూం అర్జెంట్ అయ్యింది. అయితే.. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.

Update: 2024-09-20 04:00 GMT

సింగపూర్ లోని ఒక స్టార్ హోటల్ ఎంట్రన్స్ లో మద్యం మత్తులో భారతీయుడు ఒకడు చేసిన గలీజు పనికి అక్కడి న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. విన్నంతనే కంపరం ఎత్తే ఈ ఉదంతంలోకి వెళితే.. సింగపూర్ లో రాము అనే వ్యక్తి పని చేస్తుంటాడు. క్యాసినో ఆడేందుకు ప్రముఖ మెరీనా బేసాండ్స్ రిసార్ట్స్ అండ్ హోటల్కు వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.

కాసేపు గ్యాంబ్లింగ్ ఆడిన తర్వాత బాత్రూం అర్జెంట్ అయ్యింది. అయితే.. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. బాత్రూంను వెతికే క్రమంలో అవెక్కడ ఉన్నాయో తెలుసుకోలేకపోయాడు. చివరకు మత్తులో హోటల్ ఎంట్రన్స్ ఫ్లోర్ మీదనే విసర్జించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది.. సీసీ టీవీల్లో అతడ్ని గుర్తించి అధికారులకు కంప్లైంట్ చేశారు.

గత అక్టోబరులో చోటు చేసుకున్న ఈ పాడుపని అనంతరం అతడ్ని గుర్తించారు. వెంటనే.. అతను ఉండే చోటుకు వెళ్లిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. విచారణలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో.. నిందితుడి నేరాన్ని తీవ్రంగా తప్పు పట్టిన అక్కడి న్యాయస్థానం రాముకు రూ.25 వేల రూపాయిల (మన రూపాయిల్లో) జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Tags:    

Similar News