"కబ్జా".. ప్రధనంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రెగ్యులర్ గా వినిపించే పదం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రధానంగా ఎన్నారైలు.. వారూ వీరూ అనే తేడాలేమీ లేకుండా అంతా ఏదో ఒకసారి, ఏదో ఒక రూపంలో బాధితులే అని చెబుతుంటారు.
ఆ స్థాయిలో భూ కబ్జాలు జరుగుతున్నాయని అంటారు. ఇది అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికీ పెను శాపంగా మారిందని చెబుతుంటారు. ప్రధానంగా ఎన్నారైల భూముల సంగతైతే చెప్పే పనేలేదని అంటుంటారు. అయితే.. ఇకపై అది గతం కానుంది! ఇకపై ఆ సమస్యలకు చెక్ పెట్టబోతోంది "నో కబ్జా" యాప్. ఇప్పుడు ఈ విషయం తాజా సంచలనం!
అవును... భూస్వాములు, పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణలనుంచి భూ కొనుగోలుదారులను రక్షించేందుకు "నో కబ్జా" యాప్ రూపొందించారు. దీనికి సంబంధించిన బ్రౌచర్ ని జూబ్లీహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... భూమిని కొనాలనుకునేవారికి, అమ్మాలనుకున్న వారికీ, ఇప్పటికే కొన్నవారికి అందరికి అన్ని రకాలుగా ఉపయోగపడేలా సురక్షితమైన ఓ వ్యవస్థలా ఈ నో కబ్జా యాప్ ఉందని తెలిపారు. ఇది అక్రమ, ఆక్రమణలు, భూకబ్జాలు, నకిలీ లావాదేవీల నుండి కొనుగోలుదారులను రక్షించే ఏఐ ఆధారిత భూ పరిశీలన, భద్రతా సేవ యాప్ అని పేర్కొన్నారు.
ఎన్నారైలకు భూసంరక్షణలో కీలక పాత్ర!:
ఇటీవల కాలంలో దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, చాలా మంది ఎన్నారైలు తమ దేశం పట్ల ప్రేమతో, తమ ఊరి పట్ల గౌరవంతో, భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించే ప్రయత్నంలో తాము పుట్టిపెరిగిన ప్రాంతాల్లో భూముల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, వారి భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వారికి చాలా కష్టతరంగా మారిన పరిస్థితి!
ఈ సమస్య మోసగాళ్లకు ఓ అస్త్రంగా మారింది. దీంతో.. ఇటీవల కొందరు దళారులు భూములపై అవగాహన లేని వ్యక్తుల ఆస్తులను, ఎన్నారైల భూములను లక్ష్యంగా చేసుకుని భూ దందాలను యదేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి భూ అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టేందుకు "నో కాబ్జా" సమగ్ర భూ పర్యవేక్షణ యాప్ పరిష్కారం చూపనుంది!
భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం!:
ఈ నో కబ్జా యాప్ ప్రతి ఆస్తిని క్రమంగా ట్రాక్ చేసి.. ఆక్రమణలు, మోసాలను నిరోధించడంతో పాటు భూస్వాములకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ డ్రోన్ నిఘా, ఉపగ్రహ చిత్రాలు, ఆవర్తన సైట్ తనిఖీలు, సమయానుసార హెచ్చరికలు అందించడం ద్వారా భూమి అనధికార కార్యకలాపాల నుండి రక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది.
ఇదే సమయంలో... భూమిని కొనుగోలు చేసే ముందు ఎన్నారైలు, భూములపై అవగాహన లేని పెట్టుబడిదారులు అన్ని అంశాలలో స్పష్టమైన అవగాహన పొందే విషయంలో నో కాబ్జా దిక్సూచిలా పనిచేస్తుంది. ముఖ్యంగా.. భూమి చట్టపరమైన స్థితిని, యాజమాన్య చరిత్రతో పాటు సర్కార్ వర్గీకరణలను వెల్లడిస్తుంది.
అంతేకాకుండా.. భూములను కొనుగోలు చేసే వారు మోసాల భారిన పడకుండా ఉండేందుకు నో కబ్జా యాప్ లోతైన శోధన చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన "సెర్చ్ రిపోర్ట్" సేవను అందిస్తుంది. దీని ద్వారా.. భూమి చట్టబద్ధంగా స్పష్టమైనదా..? వివాదాస్పదమైనదా..? నిరోధిత జాబితాలో ఉందా..? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు.
మోసాల రహిత భూకొనుగోలు, అమ్మకాలకు పూర్తి రక్షణ!:
భూమిని కొనాలని లేదా అమ్మాలని చూస్తున్న వారికి, నో కబ్జా యాప్ చట్టబద్ధంగా ధృవీకరించబడిన, సురక్షితమైన భూముల జాబితాను అందిస్తుంది. ఇందులో భాగంగా... ప్రతి లావాదేవీ పారదర్శకంగా ఉండటంతో పాటు.. నిజమైన భూమి యజమానులను మాత్రమే లిస్టింగ్ కు అనుమతిస్తుంది. ఇదే సమయంలో.. ప్రతి జాబితా కఠినమైన ధృవీకరణ ప్రక్రియలోకి వెళ్తుంది.
ఫలితంగా... వినియోగదారులు మోసాలకు గురికాకుండా చూడబడుతుందని చెబుతున్నారు. ఒకవేళ వెంచర్, వ్యవసాయ భూమి లేదా నివాస ప్లాట్లను కొనుగోలు చేసినా, నో కాబ్జా ఒక మోస రహిత వేదికను అందిస్తుంది.
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కాదు.. 'ల్యాండ్ ప్రొటెక్టర్స్'!:
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కొనుగోలుదారులు అమ్మకపు దారులు మధ్యవర్తుల సహాయంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతుంటారు. మధ్యవర్తి సహాయం లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఊహించలేరని చెబుతారు. అయితే.. వీటిలో చాలా భూముల తాలూకు ఖచ్చితమైన సమాచారం మధ్యవర్తులుకు తెలియవనే చెప్పాలి.
దీంతో వీరు మోసపోవడమేగాక.. వీరిని ఆశ్రయించిన వ్యక్తులు మోసపోవడానికి, నష్టపోవడానికి వీరు ఒక కారణం అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. సమస్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి సమస్యలన్నింటికి నో కబ్జా పరిష్కారం చూపే వేదిక కానుంది!
సాధారణంగా ఈ భూముల క్రయ, విక్రయాలను జరిపేవారిని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని పిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే... నో కబ్జా యాప్ లో రిజిస్టర్ అయిన మధ్యవర్తులుకు ఎప్పటికప్పుడు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించడమే గాక వారికీ ఓకే ఐడిని కేటాయించి వారిని 'ల్యాండ్ ప్రొటెక్టర్స్' గా గౌరవించడం జరుగుతుంది.
ఈ విధంగా... నో కబ్జా యాప్ లో రిజిస్టర్ అయిన ల్యాండ్ ప్రొటెక్టర్స్ కు ఎటువంటి ఫీజులు గాని ఛార్జీలుగాని ఉండవు. ఇదే సమయంలో... కొనుగోలుదారుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఈ యాప్ ల్యాండ్ ప్రొటెక్టర్స్ కు ఒక అదనపు ఆదాయ వనరుగా ఉండబోతుందని చెప్పొచ్చు.
ఇక.. జూబ్లీహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో "నో కబ్జా" యాప్ ఫౌండర్ డైరెక్టర్స్ జవ్వాది లక్ష్మయ్య నాయుడు, వీరమల్ల సత్యం గౌడ్, మహేష్ భూపతి, ఐవీ రెడ్డితో పాటు రాంచందర్ గౌడ్ - రిటైర్డ్ తహసిల్దార్, సందీప్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గౌని నర్సింహ గౌడ్, రెడీ టు సర్వ్ ఫౌండర్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.