హిందువులను చంపాలంటున్న మత పెద్ద

Update: 2016-01-04 11:03 GMT
హిందూమతంపై తీవ్రమైన విద్వేషం.. భారత దేశంపై ఆక్రోశం వెల్లగక్కుతూ ఇస్లాం మత పెద్ద ఒకరు చేసిన దారుణ ప్రసంగం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. ఇస్లాం మత పెద్దల్లో ఒకరైన మాజీ బ్యాంకర్ ఇర్ఫాన్ ఉల్ హక్ మాట్లాడుతున్న ఈ వీడియోలో ఆయన హిందూమతంపై, భారత దేశంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. భారత్ ను నాశనం చేయడం, హిందువులను హత్య చేయడం అల్లా పాకిస్థానీయులకు అప్పగించిన పవిత్ర కార్యంగా ప్రముఖ ముస్లిం బోధకుడు ఇర్ఫార్ ఉల్ హక్ అభివర్ణించారు. ప్రముఖ కాలమిస్ట్ తారిఖ్ ఫతే ఈ వీడియోను తాజాగా విడుదల చేశారు. భారత్ పై యుద్ధం చేస్తున్న సమయంలో పాకిస్థాన్ కు అల్లా తోడుంటాడని.. హిందువులను హతమార్చాలని ఇర్ఫాన్ చెబుతున్నట్లుగా ఈ వీడియో ఉండడం సంచలనం రేపుతోంది.
    
ఇర్ఫాన్ ఈ ప్రసంగాన్ని 2011లో చేసినట్లుగా చెప్తున్నారు.  ఈ ప్రపంచంలో రాతి బొమ్మలను పూజించే పిచ్చి జనం ఉన్న ప్రాంతం ఈ భూమి మీద ఉందనీ, అదే భారత్ ఉపఖండమని పేర్కొన్నారు.అటువంటి ప్రజలపై యుద్ధం చేసే పవిత్ర కార్యాన్ని అప్పగించినందుకు పాకిస్థానీయులు గర్వపడాలని పేర్కొన్నారు. భారత్ ను, హిందూ మతాన్ని ఓడించేందుకే పాకిస్థాన్ పుట్టిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
    
తారిఖ్ ఈ వీడియోను ఆదివారం యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటికే లక్షలాది మంది దాన్ని వీక్షించారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒక ఇస్లాం మత పెద్ద చేసిన దురహంకార, ప్రమాదకర వ్యాఖ్యలు ప్రపంచానికి తెలిసినట్లయింది.
Tags:    

Similar News