ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనను తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడులో ఆహా ఓహో అని పొగడటం ఆశ్చర్యకరంగా ఉందని వైసీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు మూడేళ్ల పరిపాలన అవినీతి - అక్రమాలతోనే విరాజిల్లుతుందని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సుమారు 12 ప్రధానమైన అంశాలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ లో ఉండే భయాందోళన పరిస్థితులు నేడు ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డు మీద మర్డర్ లు - తెలుగుదేశం పార్టీ నేతలు కానిస్టేబుల్స్ ను కొట్టడం - సబ్ ఇన్ స్పెక్టర్ లను కింద కూర్చోబెట్టడం - డీఎస్పీల చొక్కాలు పుచ్చుకోవడం - ఐజీలను నిర్భందించడం...ఇలా రాష్ట్రం పేరు దారుణంగా దిగజారుతోందని అన్నారు. అయినప్పటికీ మహానాడులో ఆత్మస్తుతి కోసం గొప్పలు చెప్పుకున్నారని బొత్స మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వ్యవసాయ రుణమాఫీ - పంట నష్ట నివారణ - ప్రకృతి వైపరిత్యాలకు ఇన్సూరెన్స్ - ధరల స్థిరీకరణ నిధి - డ్వాక్రా రుణమాఫీ - ఒక్కో సోసైటీకి లక్షా 50 వేల ఇళ్లు - ఎన్టీఆర్ సుజల పథకం - బీసీలకు బడ్జెట్ లో రూ. 10 వేల కోట్ల కేటాయింపు - అవినీతి రహిత పరిపాలన - శాంతిభద్రతలు అని గొప్పగా చెప్పిన చంద్రబాబు వీటిల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారని బొత్స అన్నారు. మొదట్లో రుణాలు మొత్తం మాఫీ అని - తరువాత కమిటీ వేసి రూ. 1.5 లక్షలు మాత్రమే అని మాట మార్చాడన్నారు. రూ. 25 వేల కోట్ల మాఫీ చేశామంటున్నారు కానీ ఇవాళ్టికి బడ్జెట్ నుంచి కేటాయించింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమేనని, అధనంగా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నారు. ఏ మేరకు రుణమాఫీ అయ్యిందో మహిళలు ఆలోచించుకోవాలని బొత్స అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్ కు మాత్రమే వాడుకుంటున్నాడని బొత్స మండిపడ్డారు. అధికారంలోకి రాగానే బీసీలకు బడ్జెట్ లో నుంచి సుమారు రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామన్నాడు. ఇప్పటి వరకు పైసా కేటాయించాడా అని ప్రశ్నించారు. కనుచూపు మేరల్లో ఎక్కడైనా ఆ బడ్జెట్ కనిపిస్తుందా అని బీసీలను అడిగారు. చంద్రబాబు చర్యల వల్ల బీసీలు మోసపోవాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుమీద చేపట్టిన పథకాన్ని కూడా చంద్రబాబు నీరుగార్చారని బొత్స ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ సుజల పథకం పేరుతో రూ. 2కే 20 లీటర్ల నీరు ఇస్తామన్నారు. ఆ పథకం ఎక్కడుంది ఎక్కడ అమలవుతుందో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో పెట్టిన పథకాన్ని కూడా అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని బొత్స ఆరోపించారు. ఎక్కడ వేసి గొంగడి అక్కడి అన్న మాదిరిగానే చంద్రబాబు ఇళ్ల నిర్మాణం తయారైందన్నారు. ఒక్కో సొసైటీకి లక్షా 50 వేల ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతీ గ్రామానికి తారురోడ్డు వేస్తామన్నారు. మూడేళ్ల పరిపాలనలో కనీసం ఒక్క ఇల్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రామానికైనా మంచి రోడ్డు నిర్మాణం చేపట్టారా అని చంద్రబాబును నిలదీశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.అవినీతి రహిత పరిపాలన అని చంద్రబాబు అనడం ఒక బూతు అని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. విశాఖలో లక్షల కోట్లకు సంబంధించిన భూమలు కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలు వచ్చినా అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప నాయకులపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎక్కడైతే టీడీపీ మహానాడు జరుగుతుందో.. ఆ ప్రాంతంలోనే ఇలాంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బొత్స మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
ఎన్నికల సమయంలో ఇచ్చిన వ్యవసాయ రుణమాఫీ - పంట నష్ట నివారణ - ప్రకృతి వైపరిత్యాలకు ఇన్సూరెన్స్ - ధరల స్థిరీకరణ నిధి - డ్వాక్రా రుణమాఫీ - ఒక్కో సోసైటీకి లక్షా 50 వేల ఇళ్లు - ఎన్టీఆర్ సుజల పథకం - బీసీలకు బడ్జెట్ లో రూ. 10 వేల కోట్ల కేటాయింపు - అవినీతి రహిత పరిపాలన - శాంతిభద్రతలు అని గొప్పగా చెప్పిన చంద్రబాబు వీటిల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారని బొత్స అన్నారు. మొదట్లో రుణాలు మొత్తం మాఫీ అని - తరువాత కమిటీ వేసి రూ. 1.5 లక్షలు మాత్రమే అని మాట మార్చాడన్నారు. రూ. 25 వేల కోట్ల మాఫీ చేశామంటున్నారు కానీ ఇవాళ్టికి బడ్జెట్ నుంచి కేటాయించింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమేనని, అధనంగా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నారు. ఏ మేరకు రుణమాఫీ అయ్యిందో మహిళలు ఆలోచించుకోవాలని బొత్స అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్ కు మాత్రమే వాడుకుంటున్నాడని బొత్స మండిపడ్డారు. అధికారంలోకి రాగానే బీసీలకు బడ్జెట్ లో నుంచి సుమారు రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామన్నాడు. ఇప్పటి వరకు పైసా కేటాయించాడా అని ప్రశ్నించారు. కనుచూపు మేరల్లో ఎక్కడైనా ఆ బడ్జెట్ కనిపిస్తుందా అని బీసీలను అడిగారు. చంద్రబాబు చర్యల వల్ల బీసీలు మోసపోవాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుమీద చేపట్టిన పథకాన్ని కూడా చంద్రబాబు నీరుగార్చారని బొత్స ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ సుజల పథకం పేరుతో రూ. 2కే 20 లీటర్ల నీరు ఇస్తామన్నారు. ఆ పథకం ఎక్కడుంది ఎక్కడ అమలవుతుందో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో పెట్టిన పథకాన్ని కూడా అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని బొత్స ఆరోపించారు. ఎక్కడ వేసి గొంగడి అక్కడి అన్న మాదిరిగానే చంద్రబాబు ఇళ్ల నిర్మాణం తయారైందన్నారు. ఒక్కో సొసైటీకి లక్షా 50 వేల ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతీ గ్రామానికి తారురోడ్డు వేస్తామన్నారు. మూడేళ్ల పరిపాలనలో కనీసం ఒక్క ఇల్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రామానికైనా మంచి రోడ్డు నిర్మాణం చేపట్టారా అని చంద్రబాబును నిలదీశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.అవినీతి రహిత పరిపాలన అని చంద్రబాబు అనడం ఒక బూతు అని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. విశాఖలో లక్షల కోట్లకు సంబంధించిన భూమలు కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలు వచ్చినా అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప నాయకులపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎక్కడైతే టీడీపీ మహానాడు జరుగుతుందో.. ఆ ప్రాంతంలోనే ఇలాంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బొత్స మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/