వైఎస్ ఆర్ చేయని పని చంద్రబాబు మీద జగన్ చేయబోతున్నాడా?

Update: 2020-06-23 10:10 GMT
9 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి మరీ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో గద్దెనెక్కించాడు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ.. పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ పార్టీకి అన్నీ తానై నడిపించాడు. 2009లోనూ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చాడు.

అయితే వైఎస్ఆర్ అధికారంలో ఉన్నన్నీ రోజులు చంద్రబాబు మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంచేవాడన్న పేరుంది. అందుకే వైఎస్ నాడు చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టకుండా కేవలం చంద్రబాబును ప్రజలకు దూరం చేసే పని చేశాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకొని అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీని నడిపించాడు. కేంద్రంలో యూపీఏని రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణం అయ్యాడు.

సంస్థాగతంగా టీడీపీలో బలమైన పార్టీ నేతలను అక్టివ్ గా లేకుండా చేశాడు వైఎస్ఆర్. ఇప్పుడు చంద్రబాబు స్టాండ్ మార్చి లేనిపోని దూకుడు, లేని పోనివి అన్ని మీడియా పరంగా చేస్తున్నాడు.  అదే జగన్ కోపానికి కారణం అవుతోంది.  ఇప్పటి సీఎం జగన్ ఇప్పుడు చంద్రబాబు మీద కన్నెర్ర చేసి చంద్రబాబు మంత్రుల అవినీతిని వెలికి తీస్తూ అరెస్ట్ లు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు.

అలాగే చంద్రబాబు నాయకత్వంలో నాడు పట్టిసీమ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి, అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని దాదాపుగా జగన్ సర్కార్ తేల్చేసింది. అయితే జగన్ మాత్రం చంద్రబాబు విషయంలో చూసి చూడనట్టు కాకుండా చంద్రబాబు మీద విచారణ వేసి సీబీఐకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు ఊసలు లెక్కపెట్టే పరిస్థితి వస్తుందని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 
Tags:    

Similar News