అమెరికాలో తెలుగు కుర్రాడ్రి హత్య?

Update: 2016-07-19 10:06 GMT
ఒక తెలుగు కుర్రాడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల సంకీర్త్ రెండున్నరేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడి టెక్సాస్ నగరంలోని ఆస్టీన్ లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. సోమవారం తన రూమ్ లోనే హత్యకు గురి కావటం సంచలనంగా మారింది.

అయితే.. సంకీర్త్ గదిలో రెండు వారాల కిందట సాయి సందీప్ గౌడ్ అనే కుర్రాడు రూమ్మేట్ గా చేరాడని.. అతడే ఈ హత్య చేసినట్లుగా చెబుతున్నారు.  సందీప్ గౌడ్ మీద ఉన్న సందేహంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. ఈ ఇద్దరూ రూమ్ లో ఘర్షణ పడినట్లుగా చెబుతున్నారు. ఈ గొడవే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

ఎదిగిన కొడుకు చేతికి అంది వచ్చాడన్న సంతోషంలో ఉన్న సంకీర్త్ తల్లిదండ్రులకు హత్యకు గురైన సమాచారం షాకింగ్ గా మారింది. తమ బిడ్డ హత్యకు గురి కావటంపై వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న సందీప్ గౌడ్ వివరాలు బయటకు రావాల్సి ఉంది. అతడే ఈ నేరానికి పాల్పడ్డాడా? అన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
Tags:    

Similar News